News September 5, 2024
అగ్నిపథ్ స్కీమ్లో కీలక మార్పులు?
త్రివిధ దళాల్లో నియామకాలకు తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్లో కీలక మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచడంపై చర్చలు జరుగుతున్నాయని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అలాగే ఎంపికైన వారిలో నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం 25 శాతం మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసులోకి తీసుకుంటుండగా, ఈ సంఖ్యను 50 శాతానికి పెంచే అవకాశం ఉందన్నారు.
Similar News
News February 3, 2025
U19 WC టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్.. లిస్టులో నలుగురు భారత ప్లేయర్లు
U19 మహిళల WCలో సత్తా చాటిన 12 మంది ఆటగాళ్లతో ICC టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి త్రిషతో పాటు కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవిశర్మ చోటు దక్కించుకున్నారు.
జట్టు: త్రిష, బోథా(SA), పెర్రిన్(ENG), కమలిని, కావోయిహ్మ్ బ్రే(AUS), పూజా మహతో(NEP), కైలా రేనెకే(కెప్టెన్-SA), కేటీ జోన్స్(ENG), ఆయుషి శుక్లా, చమోడి ప్రబోద(SL), వైష్ణవి శర్మ, తాబిసెంగ్(SA).
News February 3, 2025
గ్రూప్-1 ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్
TG: గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి.
News February 3, 2025
ట్రంప్తో మోదీ భేటీ.. ఎప్పుడంటే?
PM మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని ఈ నెల రెండోవారంలో ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. ఆ సమయంలోనే ఆయన ఫిబ్రవరి 13న వాషింగ్టన్లో ట్రంప్తో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. మోదీతో సమావేశం నేపథ్యంలో ట్రంప్ డిన్నర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గత నెల 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.