News October 6, 2024
ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం!

AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి <<14238313>>ఇంటర్<<>> సిలబస్, పరీక్షల విధానాన్ని మార్చడంపై విద్యామండలి కసరత్తు చేస్తోంది. అన్ని సబ్జెక్టుల్లో ఒక మార్కు ప్రశ్నలు 20 ఇవ్వడంతోపాటు 2, 4, 8 మార్కుల విధానాన్ని తీసుకురానుంది. ప్రతి ప్రశ్నకు మరో ప్రశ్న ఛాయిస్గా ఉంటుంది. ఆర్ట్స్ గ్రూప్స్లో హిస్టరీ మినహా దాదాపు అన్ని సబ్జెక్టులకూ NCERT సిలబస్నే అమలుచేయనుంది. మ్యాథ్స్, కెమిస్ట్రీ సిలబస్ను కుదించనుంది.
Similar News
News March 4, 2026
Stock Market: ₹9.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇంకా భారీ నష్టాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్ 1367 pts నష్టపోయి 78,871 వద్ద, నిఫ్టీ 451 pts క్షీణించి 24,414 వద్ద కొనసాగుతోంది. యుద్ధ ప్రభావం మార్కెట్ సూచీలను కిందకు లాగుతోంది. ఈ ఒక్కరోజే ట్రేడింగ్ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు ₹9.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఇన్ఫీ, ఎయిర్టెల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో.. టాటా స్టీల్, LT, అల్ట్రాటెక్, ఇండిగో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
News March 4, 2026
మంచి మనుసు చాటుకున్న అల్లు అర్జున్!

టాలీవుడ్ సీనియర్ నటి పావలా <<18529362>>శ్యామల<<>>, ఆమె కుమార్తె ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్లోని ఓ ఫౌండేషన్లో ఉంటున్నారు. వీరి ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మానవత్వంతో స్పందించారు. వారి వైద్య & నిత్యావసర ఖర్చుల కోసం ప్రతి నెలా రూ.10 వేలు అందేలా ఏర్పాటు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇబ్బందుల్లో ఉన్న నటికి బన్ని చేసిన సాయంపై ప్రశంసలొస్తున్నాయి.
News March 4, 2026
గర్భిణుల్లో రక్తహీనతకు కారణం ఇదే!

కట్టెలు, పిడకలు మండించి వంట చేయడం వల్ల కలిగే వాయు కాలుష్యం ఇండియాలోని గర్భిణులలో రక్తహీనత ముప్పును 43% పెంచుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘దీనివల్ల వెలువడే విషవాయువులు రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, పేద మహిళలు దీని బారిన పడుతున్నారు. రక్తహీనతను తగ్గించి తల్లీబిడ్డల ఆరోగ్యం కాపాడాలంటే స్వచ్ఛమైన ఇంధనాన్ని వాడటం అత్యవసరం’ అని నిపుణులు సూచిస్తున్నారు.


