News April 11, 2025
పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం

TGలో ప్రస్తుతం ఫింగర్ ప్రింట్ ద్వారా పెన్షన్లు అందజేస్తుండగా ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకోసం సెర్ప్ ప్రత్యేక యాప్ను రూపొందిస్తోంది. మే/జూన్ నుంచి దీనిని ప్రారంభించనుంది. వృద్ధులకు వేలిముద్రలు పడక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ కేటగిరీల్లో రాష్ట్రంలో 42.96L మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. దివ్యాంగులకు నెలకు ₹4,016, ఇతరులకు ₹2,016 అందుతోంది.
Similar News
News January 5, 2026
శివ మానస పూజ చేద్దామా?

మూర్తి పూజ కన్నా మానస పూజ ఎన్నో రెట్లు శ్రేష్ఠమని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘నా ఆత్మయే శివుడు. నా శరీరమే ఆలయం’ అనే భావనతో శివ మానస పూజ చేస్తారు. బాహ్య వస్తువులతో సంబంధం లేకుండా మదిలోనే శివుడిని ఆరాధించే ఈ ప్రక్రియను ఆదిశంకరాచార్యులు రచించారు. ఈ పూజతో మనసులో చింతలు తొలగుతాయని, శివసాన్నిధ్యాన్ని సులభంగా పొందవచ్చని పండితులు చెబుతారు. శివ మానస పూజ ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 5, 2026
వరి నారుమడిలో జింకు లోపం నివారణ

పెరిగిన చలి కారణంగా ఇప్పటికే పోసిన వరి నారుమళ్లకు జింక్ ధాతువు లభ్యత తగ్గుతుంది. నారుమడిలో జింక్ లోప లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిలో పిచికారీ చేయాలి. అలాగే వరి నారుమడికి పది గ్రాముల 19:19:19 పోషకాన్ని, 2.5 గ్రాముల కార్బెండజిమ్, మ్యాంకోజెబ్ మిశ్రమాన్నిలీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
News January 5, 2026
ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేస్తున్నారా?

చలికాలంలో పదేపదే ముఖం కడుక్కోవడం వల్ల చర్మానికి ఇబ్బంది కలుగుతుందంటున్నారు నిపుణులు. ప్రతిసారీ సబ్బును వాడటం వల్ల చర్మం.. సహజ నూనెలను కోల్పోతుంది. పీహెచ్ స్థాయి తగ్గడంతోపాటు చర్మంపై రక్షణగా ఉండే పొర కూడా బలహీన పడిపోతుంది. దాంతో స్వేదగ్రంథులు మరింత నూనెను ఉత్పత్తి చేస్తూ.. మొటిమలు రావడానికి కారణం అవుతాయి. అలాగే ముఖం ఎక్కువగా కడుక్కోవడం, తుడుచుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది.


