News October 3, 2025
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

AP: సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్, జలవనరుల, విద్యుత్ శాఖ పనులు, అమృత్ పథకం 2.0 పనులకు, ఆటో/క్యాబ్ డ్రైవర్లకు ₹15,000, అమరావతిలో SPV ఏర్పాటు, పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుష్టు వ్యాధి పదం తొలగించే చట్ట సవరణ, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
Similar News
News October 3, 2025
‘శ్వేతనాగు’ సినిమా రచయిత కన్నుమూత

ప్రముఖ రచయిత లల్లా దేవి (82) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా నిమ్మగడ్డవారిపాలెం గ్రామానికి చెందిన ఆయన అసలు పేరు పరుచూరి నారాయణాచార్యులు. ‘లల్లా దేవి’ పేరిట కథలు, నవలలు రాశారు. దివంగత నటి సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన ‘శ్వేతనాగు’ సినిమాకు కథ అందించారు. 150కి పైగా నవలలు, నాటకాలు రచించారు. వాటిలో ఆమ్రపాలి, మహామంత్రి తిమ్మరుసు వంటి నవలలు పాపులర్ అయ్యాయి.
News October 3, 2025
అనిల్ అంబానీ పిటిషన్ను కొట్టేసిన బాంబే హైకోర్టు

తన కంపెనీ అకౌంట్లను ‘ఫ్రాడ్’గా వర్గీకరిస్తూ SBI ఇచ్చిన ఆర్డర్ను కొట్టేయాలని Reliance(ADA)Group ఛైర్మన్ అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంటు, అంతర్గత విధానాలపై RBI ఆదేశాల ప్రకారం అనిల్ కంపెనీ అకౌంట్లను బ్యాంకు జూన్లో ఫ్రాడ్గా పేర్కొంది. అయితే ముందుగా తన వాదనలను వినలేదని, ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని అనిల్ తరఫు లాయర్లు వాదించారు.
News October 3, 2025
4 ని.ల Zoom కాల్తో ఉద్యోగులకు ఉద్వాసన

INDIAN ఉద్యోగులకు 4ని.ల జూమ్ కాల్తో ఉద్వాసన పలికిందో US కంపెనీ. ఉన్నపళంగా రోడ్డున పడి వారు లబోదిబోమంటున్నారు. దీనిపై ఓ ఉద్యోగి పెట్టిన పోస్టు వైరలవుతోంది. ‘ఎప్పటి మాదిరిగానే సిస్టమ్లో లాగిన్ అయ్యా. 11గం.లకు COO జూమ్ కాల్ చేసి రీస్ట్రక్చరింగ్లో ఇండియన్ వర్క్ఫోర్స్ను తొలగిస్తున్నాం అని ప్రకటించారు. ఇంకే మాటల్లేకుండా కాల్ కట్ చేశారు’ అని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులంతా షాక్కు గురయ్యారు.