News April 15, 2025

రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

image

AP: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌కు CM చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.789 కోట్లతో హైకోర్టు భవనం నిర్మాణ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటిని ఎల్-1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటు, పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణ ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Similar News

News December 30, 2025

నేడు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

image

మకరవిళక్కు పండుగ కోసం శబరిమల అయ్యప్ప ఆలయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. పవిత్రమైన దీపాన్ని వెలిగించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. మకరవిళక్కు పూజల నేపథ్యంలో స్వామి దర్శనానికి లక్షల మంది తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మండల పూజ తర్వాత శనివారం రాత్రి ఆలయాన్ని <<18690795>>మూసివేసిన<<>> విషయం తెలిసిందే.

News December 30, 2025

కంకి ఎర్రనైతే కన్ను ఎర్రనౌతుంది

image

వరి పంట పండే సమయంలో కంకి (వరి వెన్ను) సహజంగా బంగారు వర్ణంలో ఉండాలి. కానీ, విపరీతమైన వర్షాలు కురిసినా లేదా ఏదైనా తెగులు సోకినా కంకులు ఎర్రగా మారిపోతాయి. దీనివల్ల ధాన్యం నాణ్యత దెబ్బతింటుంది. కష్టపడి పండించిన పంట కళ్లముందే పాడైపోవడం చూసి రైతు కన్ను ఎర్రనౌతుంది (అంటే దుఃఖంతో కన్నీళ్లు వస్తాయి). పంట దిగుబడి, స్థితికి.. రైతు మనస్తత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ సామెత తెలియజేస్తుంది.

News December 30, 2025

119 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) ఘజియాబాద్‌ 119 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, BTech, BSc(engg.), MBA ఉత్తీర్ణులైనవారు జనవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. JAN 11న రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. ఆఫీసర్ -గ్రేడ్1కు నెలకు రూ.30వేలు, ఆఫీసర్-గ్రేడ్2కు రూ.35,000, ఆఫీసర్-గ్రేడ్3కు రూ.40వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: bel-india.in/