News June 18, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. SIBకి టెక్నికల్ సపోర్ట్ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఛైర్మన్ రవికుమార్ నుంచి హార్డ్ డిస్క్లను సిట్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రవికుమార్కు చెందిన హైదరాబాద్, బెంగళూరులోని ఇళ్లు, కార్యాలయాల్లో మూడు సర్వర్లు, ఐదు మినీ డివైజ్లనూ వెంట తీసుకెళ్లారని తెలుస్తోంది. కాగా ఫోన్ ట్యాపింగ్కు ప్రణీత్ రావు ఈ ల్యాబ్ సహకారమే తీసుకున్నారు.
Similar News
News September 15, 2025
ఆర్బీఐలో 120 పోస్టులు

<
News September 15, 2025
షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం బాధించింది: పాక్ కోచ్

మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు <<17712244>>షేక్ హ్యాండ్<<>> ఇవ్వకపోవడం తమను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని పాక్ కోచ్ మైక్ హెసన్ అన్నారు. వారి కోసం గ్రౌండ్లో తాము చాలాసేపు ఎదురుచూశామని, ఇది సరికాదని పేర్కొన్నారు. ఈ మ్యాచులో తమ ప్రదర్శన కూడా ఏమీ బాగోలేదని వ్యాఖ్యానించారు. కాగా నిన్న భారత ప్లేయర్స్ పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయని విషయం తెలిసిందే. టాస్ టైమ్లోనూ పాక్ కెప్టెన్తో సూర్య చేతులు కలపలేదు.
News September 15, 2025
GSTని తగ్గించిన కేంద్రం.. ప్రీమియం పెంచేస్తున్న కంపెనీలు!

కేంద్రప్రభుత్వం బీమా ప్రీమియంపై జీఎస్టీని 18% నుంచి సున్నాకు తగ్గించినా ప్రజలకు ఆ మేర లబ్ధి చేకూరట్లేదు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు 3 నుంచి 5 శాతం వరకు ప్రీమియాన్ని పెంచేశాయి. సెప్టెంబర్ 16 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తన కంపెనీ ప్రకటించినట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీంతో ప్రజలకు జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాలు అందట్లేదు. అంతిమంగా 13% వరకే ఆదా కానున్నాయి.