News February 9, 2025
స్కూళ్లకు కీలక ఆదేశాలు

AP: ఈ నెల 10న విద్యార్థులతో ప్రధాని మోదీ చేపట్టే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని అందరూ చూసేలా అన్ని స్కూళ్లల్లో ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకోసం RJD, DEO, ప్రిన్సిపాళ్లు చర్యలు చేపట్టాలని సూచించింది. రేపు ఉ.11 గంటలకు DD న్యూస్, DD ఇండియా ద్వారా లైవ్ ఉంటుందని తెలిపింది. విద్యార్థులు, టీచర్లు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఫొటోలను SCERT AP, MyGov పోర్టల్లో అప్లోడ్ చేయాలంది.
Similar News
News March 7, 2026
ఇవాళ భారీగా లొంగిపోనున్న మావోలు.. గణపతి ఉంటారా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎదుట ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం నిర్వహించే ప్రెస్మీట్లో 124 మంది ఆయుధాలతో సహా సరెండర్ కానున్నారు. కేంద్ర బలగాలు, పోలీసులు ఎప్పటి నుంచో వెతుకుతున్న మావో టాప్ కమాండర్ గణపతి వీరిలో ఉంటారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల సరెండర్ అయిన దేవ్జీ సహా కీలక నేతల గన్మెన్లు, అనుచరులు లొంగిపోనున్నారు.
News March 7, 2026
‘పుష్పక్’ వచ్చేస్తోంది.. హార్ముజ్ దాటిన భారత నౌక

యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ రవాణా చేసే వందలాది నౌకలు అక్కడే నిలిచిపోయాయి. సోమవారం నుంచి కేవలం 9 ఓడలు మాత్రమే జలసంధిని దాటాయి. ఇందులో భారత్కు చెందిన ‘పుష్పక్’ కూడా ఉంది. ఇది పెట్రోలియం ఉత్పత్తులను ఇండియాకు తీసుకొస్తోంది. దీంతో దేశంలో ఇంధన నిల్వలకు మరింత బూస్ట్ రానుంది.
News March 7, 2026
మెదడును చురుగ్గా పనిచేయించే ‘కోకో’

కోకో తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిలోని ఫ్లావనాల్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి, మెదడుకు ఆక్సిజన్ను అందిస్తాయి. ఫలితంగా ఏకాగ్రత పెరగడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, మానసిక అలసట తగ్గుతుందని పేర్కొన్నారు. రోజుకు 3 చెంచాల కోకో పౌడర్ను పాలు/ నీటిలో కలుపుకుని తాగితే మెదడు మరింత చురుగ్గా మారుతుందని సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్లోనూ కోకో ఉంటుంది.


