News April 21, 2024

కలెక్టర్లకు పౌరసరఫరాలశాఖ కీలక ఆదేశాలు

image

AP: ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్లకు ఏపీ పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రచారం, డబ్బు, కరపత్రాల పంపిణీ ఇతర వ్యవహారాల్లో ఎండీయూ ఆపరేటర్లు పాల్గొనకుండా చూడాలని సూచించారు. రేషన్ వాహనాల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారనే ఫిర్యాదులపై ఆయన స్పందించారు. లబ్ధిదారులకు నిత్యావసరాల పంపిణీతో పాటు ఎన్నికల నియమావళి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News February 22, 2026

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి వర్షాలు

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. APలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని అంచనా వేసింది. TGలోని ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ సహా 18 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News February 22, 2026

నట్టింట్లో తల చిక్కు తీయకండి

image

ఇంటి మధ్య భాగాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. అక్కడ తల దువ్వితే వెంట్రుకలు రాలి ఇంట్లోనే పడతాయి. ఇల్లంతా వ్యాపిస్తాయి. తినే ఆహారంలోనూ పడే ఛాన్సుంది. వస్తువులపై పడే అవకాశం కూడా ఉంది. ఇది అశుభ్రతకు దారితీస్తుంది. ఆధ్యాత్మికంగా లక్ష్మీదేవి నివసించే చోట ఇలా చేయకూడదు. ఇది దారిద్రానికి హేతువని పండితులు చెబుతారు. విడిగా ఒక గదిలో/బాత్రూంలో తల దువ్వుకోవాలి. తద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం.

News February 22, 2026

సూపర్-8: ‘సూర్య’సేన జోరు కొనసాగేనా?

image

T20 WC సూపర్-8లో నేడు 2 కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు పల్లెకెలెలో ఇంగ్లండ్, శ్రీలంక తలపడతాయి. అనంతరం అహ్మదాబాద్ వేదికగా 7pmకు భారత్, సౌతాఫ్రికా మధ్య పోరు జరగనుంది. గ్రూప్ స్టేజ్‌లో అన్ని మ్యాచుల్లో గెలిచిన సూర్య సేన.. అదే ఊపుతో సౌతాఫ్రికాను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. అహ్మదాబాద్ గడ్డపై టీమ్ఇండియా బ్యాటర్లు ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.