News January 29, 2025
ఆత్మీయ భరోసా అర్హుల గుర్తింపుపై కీలక ఆదేశాలు

TG: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అర్హుల గుర్తింపును ఫిబ్రవరి 2లోగా పూర్తి చేయాలని అధికారులను పంచాయతీ రాజ్ శాఖ ఆదేశించింది. లబ్ధిదారుల వివరాలను అదే రోజు సా.5గంటల లోపు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించింది. ఆ తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదని పేర్కొంది. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఏడాదికి ₹12వేలు అందించనుంది. ఇప్పటికే తొలి విడతలో పలువురికి ₹6వేల చొప్పున జమ చేసింది.
Similar News
News November 26, 2025
IIIT-నాగపుర్లో ఉద్యోగాలు

<
News November 26, 2025
టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

AP: ఇటీవల ఉదయ్పూర్లో అట్టహాసంగా కూతురి పెళ్లి చేసిన బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9కోట్లు ఇచ్చినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు.
News November 26, 2025
పలాశ్ను అన్ఫాలో చేసిన స్మృతి.. నిజమిదే!

కాబోయే భర్త పలాశ్ ముచ్చల్తో పెళ్లికి ముందు వేడుకల ఫొటోలను స్మృతి మంధాన డిలీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇన్స్టాలో అతడిని ఆమె అన్ఫాలో చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది అవాస్తవమని తేలింది. పలాశ్ను ఆమె ఫాలో అవుతున్నారు. స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో ఈ నెల 23న జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. పలాశ్ చాటింగ్ బయటపడటంతో పెళ్లి మొత్తానికే రద్దయిందంటూ SMలో ప్రచారం జరుగుతోంది.


