News April 23, 2025
మోదీ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభం

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. దీనికి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.
Similar News
News August 9, 2025
రికార్డు స్థాయిలో భారత రక్షణ ఉత్పత్తులు

భారత డిఫెన్స్ ప్రొడక్షన్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2024-25లో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1,50,590 కోట్లకు చేరింది. ఈ మేరకు డిఫెన్స్ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది రూ.1.27 లక్షల కోట్లు ఉన్న ప్రొడక్షన్ వాల్యూ ఇప్పుడు 18 శాతం పెరిగింది. మొత్తం ఉత్పత్తుల్లో పబ్లిక్ సెక్టార్ వాటానే 77% కావడం విశేషం. దిగుమతులు తగ్గించుకుని ఇతర దేశాలకు రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేసే దిశగా భారత్ సాగుతోంది.
News August 9, 2025
రాఖీ కట్టని కవిత, షర్మిల

తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలక నేతలుగా ఉన్న కవిత, షర్మిల తమ సోదరులకు ఈ ఏడాది రాఖీ కట్టలేదు. ప్రతి ఏటా తమ అనుబంధాన్ని చాటే కేటీఆర్-కవిత ఈ సారి వేడుకలకు దూరంగా ఉన్నారు. కేటీఆర్ కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. మరోవైపు మాజీ సీఎం జగన్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య రాజకీయ వైరంతో దూరం పెరిగింది. దీంతో గతేడాది మాదిరే ఇవాళ కూడా జగన్కు షర్మిల రాఖీ కట్టలేదు.
News August 9, 2025
ఒక్క విమానమూ కూలలేదు: పాక్ రక్షణ మంత్రి

ఆపరేషన్ సిందూర్లో పాక్కు చెందిన 6 విమానాలను <<17350664>>కూల్చేశామని<<>> IAF చీఫ్ మార్షల్ AP సింగ్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఖండించారు. ‘ఒక్క పాక్ విమానాన్నీ ఇండియా కూల్చలేదు. 3 నెలల నుంచి వారేం మాట్లాడలేదు. కానీ మేము ఇంటర్నేషనల్ మీడియాకు అన్నీ వివరించాం. ఒకవేళ నమ్మకం లేకుంటే దీనిపై స్వతంత్ర విచారణ జరిపించాలి. అయినా భారత్ నిజాన్ని బయటకి రానివ్వదు’ అని వ్యాఖ్యానించారు.