News November 4, 2024

రేపు కప్పట్రాళ్లలో కీలక సమావేశం

image

AP: కర్నూలు జిల్లా దేవనకొండ(మ) కప్పట్రాళ్లలో రేపు కీలక సమావేశం జరగనుంది. యురేనియం పరీక్షలను వ్యతిరేకిస్తూ రెండ్రోజులుగా ఆందోళనలు చేస్తున్న స్థానికులను అధికారులు చర్చలకు ఆహ్వానించారు. కప్పట్రాళ్లతో పాటు సమీప గ్రామ ప్రజలకు ఆహ్వానాలు పంపారు. శాస్త్రవేత్తల బృందం, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ప్రజలతో చర్చించనున్నారు. వారిలో మెదులుతున్న అనుమానాలను నివృత్తి చేయనున్నారు.

Similar News

News October 15, 2025

ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చి.. కొడుకుకు తండ్రి గుణపాఠం!

image

TG: తన బాగోగులు చూసుకోని కొడుకుకు సరైన గుణపాఠం చెప్పాడా తండ్రి. హన్మకొండ(D) ఎల్కతుర్తి మాజీ MPP శ్యాంసుందర్ రూ.3Cr విలువైన మూడెకరాల భూమిని ప్రభుత్వానికి రాసిచ్చారు. ప్రభుత్వ స్కూల్/ కాలేజీ కట్టి తన భార్య పేరు పెట్టాలని కోరారు. భార్య మరణించినప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆయనను కొడుకు రంజిత్ రెడ్డి చేరదీయలేదు. పైగా కొంత ఆస్తి తన పేరిట రాయించుకొని దాడి చేశారు. దీంతో శ్యాంసుందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

News October 15, 2025

ఆవు పేడతో నెలకు రూ.25వేల ఆదాయం

image

జీవితంలో ఎదగాలనే తపన ఉంటే ఆవు పేడతోనూ అద్భుతాలు చేయొచ్చని నిరూపిస్తున్నారు మధ్యప్రదేశ్‌ సాగర్ ప్రాంత మహిళలు. పేడతో కుందులు, బొమ్మలు, ల్యాంప్స్, గోడ గడియారాల లాంటివి తయారు చేసి విక్రయిస్తున్నారు. కొన్ని వస్తువులను విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా సగటున ₹25K వరకు సంపాదిస్తున్నారు. పండుగ సమయాల్లో ఈ మొత్తం ₹80వేలకు చేరుతోంది.
* రోజూ మహిళల స్ఫూర్తిదాయక కథనాల కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.

News October 15, 2025

పంచ భూతాలేనా? ఆరోది కూడా ఉందా?

image

ఈ అనంత విశ్వం పంచభూతాల కలయికతోనే ఏర్పడింది. ఆరో భూతం లేదు. చైతన్య స్వరూపుడైన పరమాత్మ ఈ 5 శక్తుల ద్వారానే సృష్టిని నడుపుతాడు. భూమి సృష్టికి ఆధారం కాగా, జలం వృద్ధి చేస్తుంది. అగ్ని మార్పును తీసుకురాగా, వాయువు జీవాన్ని ఇస్తుంది, తీసుకుపోతుంది. ఆకాశం సర్వాన్నీ అనుగ్రహిస్తుంది. ప్రజల సుఖ దుఃఖాలు, విశ్వ భవిష్యత్తు ఈ ప్రకృతి శక్తులపైనే ఆధారపడి ఉంటాయనే సత్యాన్ని జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు.<<-se>>#SIVOHAM<<>>