News November 4, 2024
రేపు కప్పట్రాళ్లలో కీలక సమావేశం

AP: కర్నూలు జిల్లా దేవనకొండ(మ) కప్పట్రాళ్లలో రేపు కీలక సమావేశం జరగనుంది. యురేనియం పరీక్షలను వ్యతిరేకిస్తూ రెండ్రోజులుగా ఆందోళనలు చేస్తున్న స్థానికులను అధికారులు చర్చలకు ఆహ్వానించారు. కప్పట్రాళ్లతో పాటు సమీప గ్రామ ప్రజలకు ఆహ్వానాలు పంపారు. శాస్త్రవేత్తల బృందం, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ప్రజలతో చర్చించనున్నారు. వారిలో మెదులుతున్న అనుమానాలను నివృత్తి చేయనున్నారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


