News February 16, 2025

‘సచివాలయ’ ఉద్యోగుల రేషనలైజేషన్‌పై రేపు కీలక భేటీ

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌పై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే ఈ విషయంపై ఉత్తర్వులు జారీ చేయగా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో రేపు ఆయా సంఘాల నేతలతో మంత్రి డోలా వీరాంజనేయస్వామి భేటీ కానున్నారు. <<15268707>>క్రమబద్ధీకరణ<<>> తర్వాత మిగిలిపోయే 40వేల మందిని ఏ శాఖల్లోకి కేటాయించాలి? అనే అంశంపై వారి సూచనలు తీసుకోనున్నారు.

Similar News

News January 7, 2026

ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 315 ప్రత్యేక బస్సులు: ఆర్.ఎం

image

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో వివిధ ప్రాంతాలకు 315 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు (ఆర్‌ఎం) భవాని ప్రసాద్ తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ బస్సులను కేటాయించామని, ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News January 7, 2026

ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 315 ప్రత్యేక బస్సులు: ఆర్.ఎం

image

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో వివిధ ప్రాంతాలకు 315 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు (ఆర్‌ఎం) భవాని ప్రసాద్ తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ బస్సులను కేటాయించామని, ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News January 7, 2026

NZB: సీఎంకి వినతిపత్రం అందించిన టీపీసీసీ అధ్యక్షుడు

image

భీంగల్ మండలం రహత్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్, కాలేజీని మంజూరు చేయాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించారు. HYDలో సీఎంని కలిసి జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. విద్యా సౌకర్యాల మెరుగుదలకు సీఎం సానుకూలంగా స్పందించారని మహేష్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, NZB అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.