News February 10, 2025
కల్తీ నెయ్యి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలు వెల్లడించింది. నిందితులు ఆధారాలు చెరిపేసేందుకు పాత ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని తెలిపింది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా ఏఆర్, వైష్ణవి డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయని పేర్కొంది. బోలేబాబా డెయిరీ నెయ్యిని తమ పేరు మీద టీటీడీకి సరఫరా చేసినట్లు వివరించింది. నిందితులు విచారణకు సహకరించడంలేదని తెలిపింది.
Similar News
News December 7, 2025
ములుగు: కాంగ్రెస్లో కొనసాగుతున్న సస్పెన్షన్లు

పంచాయతీ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్లో బహిష్కరణలు కొనసాగుతున్నాయి. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని శనివారం పీఏసీఎస్ ఛైర్మన్ చిక్కుల రాములు, మాజీ సర్పంచ్ అహ్మద్ పాషా, మాజీ ఎంపీటీసీ అశోక్ను డీసీసీ అధ్యక్షుడు అశోక్ సస్పెండ్ చేశారు. ఆదివానం ములుగు మండలం పొట్లాపూర్కు చెందిన రాజ్ కుమార్, వెంకట్ రెడ్డి, పాపయ్యలను పార్టీ నుంచి బహిష్కరించినట్లు మండల అధ్యక్షుడు చాంద్ పాషా తెలిపారు.
News December 7, 2025
గోవాకు వెళ్తున్నారా? జాగ్రత్త

2023లో HYD యువతి (30) పెళ్లికి ముందు ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడ బస ఏర్పాట్లు చేసిన యశ్వంత్ అనే వ్యక్తి తాజాగా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడితో గడిపిన వీడియోలను రికార్డు చేశానని, రూ.30 లక్షలు ఇవ్వకుంటే బయటపెడతానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిందని చెప్పినా వినట్లేదని వాపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 7, 2025
టెన్త్, ఇంటర్ అర్హతతో NGRIలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<


