News February 10, 2025
కల్తీ నెయ్యి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలు వెల్లడించింది. నిందితులు ఆధారాలు చెరిపేసేందుకు పాత ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని తెలిపింది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా ఏఆర్, వైష్ణవి డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయని పేర్కొంది. బోలేబాబా డెయిరీ నెయ్యిని తమ పేరు మీద టీటీడీకి సరఫరా చేసినట్లు వివరించింది. నిందితులు విచారణకు సహకరించడంలేదని తెలిపింది.
Similar News
News December 12, 2025
నెల్లూరు మేయర్పై అవిశ్వాసం.. క్యాంప్ రాజకీయాలు షురూ

AP: నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఈ నెల 18న ప్రవేశపెట్టనుండటంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. కార్పొరేటర్లను గోవాకు తరలించేందుకు TDP ప్లాన్ చేస్తోందని YCP ఆరోపిస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 54 కార్పొరేటర్ స్థానాల్లో YCP గెలవగా తర్వాత మెజార్టీ సభ్యులు TDPలో చేరారు. తాజాగా ఐదుగురు తిరిగి YCP గూటికి చేరడంతో ఆ పార్టీ బలం 16కు చేరినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ అప్రమత్తమైంది.
News December 12, 2025
డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 12, 2025
నా వ్యక్తిత్వ హక్కులను కాపాడండి.. హైకోర్టులో పవన్ పిటిషన్

AP: తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ Dy.CM పవన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. AI వీడియోలతో పవన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా SMలో పోస్టులు చేస్తున్నారని ఆయన తరఫు లాయర్ తెలిపారు. దీంతో డిలీట్ చేసేందుకు ఆ లింక్లను 48hrsలోపు SM సంస్థలకు అందించాలని న్యాయమూర్తి సూచించారు. వాటిపై వారంలోపు చర్యలు తీసుకోవాలని గూగుల్, మెటా తదితర ప్లాట్ఫామ్లను ఆదేశిస్తూ తదుపరి విచారణను DEC 22కు వాయిదా వేశారు.


