News February 10, 2025
కల్తీ నెయ్యి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలు వెల్లడించింది. నిందితులు ఆధారాలు చెరిపేసేందుకు పాత ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని తెలిపింది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా ఏఆర్, వైష్ణవి డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయని పేర్కొంది. బోలేబాబా డెయిరీ నెయ్యిని తమ పేరు మీద టీటీడీకి సరఫరా చేసినట్లు వివరించింది. నిందితులు విచారణకు సహకరించడంలేదని తెలిపింది.
Similar News
News December 23, 2025
DANGER: చలికాలమే అని నీళ్లు తాగట్లేదా?

చలికాలంలో బాడీకి నీళ్ల అవసరం లేదని చాలామంది పొరబడుతుంటారు. కానీ శ్వాస, యూరిన్ ద్వారా బాడీలోని వాటర్ బయటకు పోతుంది. రక్తం చిక్కగా మారి గుండె మీద ప్రెజర్ పడుతుంది. BP పెరుగుతుంది. కిడ్నీలు మలినాలను క్లీన్ చేయలేవు. స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది. స్కిన్ డ్రై అవ్వడం, పెదవులు పగలడం, మలబద్ధకం వంటి డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయి. అందుకే వింటర్లోనూ 2-3 లీటర్ల నీళ్లు తాగాలనేది డాక్టర్ల సూచన.
News December 23, 2025
జూన్ నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి: పార్థసారథి

AP: 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి చెప్పారు. నిర్మాణంలో ఉన్న 5.5L ఇళ్లను వచ్చే జూన్-జులై నాటికి పూర్తి చేయాలని CM ఆదేశించారన్నారు. టిడ్కో గృహాలకుగాను కేంద్రంతో కలిసి SC, BC, మైనార్టీలకు ₹50K, STలకు ₹75K, పీజీటీడీఎస్ వర్గాలకు ₹లక్ష వరకు అదనపు సాయం అందిస్తున్నాం. అన్ని సమస్యలను పరిష్కరించి వచ్చే జూన్కు గృహాలను అందిస్తాం’ అని తెలిపారు.
News December 23, 2025
ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు.. క్లారిటీ

TG: ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దుపై కొంత గందరగోళం నెలకొంది. కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మండలాలు 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం మెమో ఇచ్చింది. పంచాయతీ కార్యదర్శి/MPDO, సర్పంచ్/MPP డిజిటల్ సంతకాలతో పేమెంట్స్ జరుగుతాయని పేర్కొంది. అయితే అధికారుల, మీడియా గ్రూపుల్లో ఇది ఉపసర్పంచ్లకు చెక్ పవర్ రద్దుగా ప్రచారమైంది. వాస్తవానికి ఉపసర్పంచ్ చెక్ పవర్ తొలగించలేదు.


