News March 13, 2025

ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు

image

AP: వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచే ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన ఇంటర్‌ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఒకే సబ్జెక్ట్‌గా మ్యాథ్స్ ఎ-బి, బోటనీ-జువాలజీని చేయనున్నారు. జూనియర్‌ కాలేజీల్లో ఎంబైపీసీ కోర్సుకు అనుమతి ఇవ్వనున్నారు. జూన్‌ 1వ తేదీకి బదులుగా ఏప్రిల్ 7 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించారు.

Similar News

News December 17, 2025

ఇండియన్ మ్యూజియంలో ఉద్యోగాలు

image

కోల్‌కతాలోని <>ఇండియన్ <<>>మ్యూజియం 3 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, డిగ్రీ (జర్నలిజం& మాస్ కమ్యూనికేషన్/ మీడియా సైన్స్/ఫైన్ ఆర్ట్స్/విజువల్ ఆర్ట్స్) అర్హతతో పాటు పని అనుభవం గల వారు జనవరి 2 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 4ఏళ్లు. జీతం నెలకు రూ.35వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://indianmuseumkolkata.org

News December 17, 2025

జీడిమామిడిలో ఆకు, పూత, కాయమచ్చ తెగులు నివారణ

image

ఈ తెగులు వల్ల ఆకులపై లేత ఆకుపచ్చ రంగులో మచ్చలు ఏర్పడి అవి పెరుగుతూ మచ్చ మధ్య ఎండిపోయి చివరికి మొత్తం ఆకు ఎండి రాలిపోతుంది. పూత, పూత కాడలపై మచ్చలు వచ్చి పూత ఎండిపోయి రాలిపోతుంది. ఈ మచ్చ తెగులు నివారణకు రైతులు తొలుత తెగులు ఆశించిన కొమ్మలను పూర్తిగా తొలగించాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 1 గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 1ml కలిపి పిచికారీ చేసుకోవాలి.

News December 17, 2025

పైలట్ శిక్షణను వేగవంతం చేయనున్న ఇండిగో

image

ఇండిగో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ ట్రైనింగ్, కెప్టెన్‌ అప్‌గ్రేడ్లను వేగవంతం చేయాలని నిర్ణయించింది. గతంలో నెలకు 35-40 మందిని కెప్టెన్లుగా ప్రమోట్‌ చేసిన సంస్థ, ఈ ఏడాది 10-12 మందికే పరిమితమైంది. ఇక జనవరి నుంచి మళ్లీ పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్లు ప్రారంభించనుంది. అయితే కొత్త కెప్టెన్లు 18-24 నెలల పాటు వేరే బేస్‌లో పనిచేయాలి. మధ్యలో వెళ్లిపోతే రూ.20-30 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంటుంది.