News October 24, 2024
KG శనగపప్పు ₹60, మైసూర్ పప్పు ₹89

శనగ, మైసూర్ పప్పులను కేంద్ర ప్రభుత్వం ‘భారత్ బ్రాండ్’లో చేర్చింది. దీంతో శనగపప్పు KG ₹60, మైసూర్ పప్పు ₹89కే లభించనుంది. పెరుగుతోన్న ధరలను నియంత్రించే ప్రయత్నంలో భాగంగానే సబ్సిడీపై పప్పులను అందించాలని కేంద్రం నిర్ణయించింది. మార్కెట్లో శనగపప్పు ₹110, మైసూర్ పప్పు ₹115కు పైనే ఉంది. అమెజాన్, జియోమార్ట్తో పాటు బిగ్బాస్కెట్, బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు.
Similar News
News November 7, 2025
డికాక్ సూపర్ సెంచరీ.. ఒంటి చేత్తో గెలిపించాడు

మూడు వన్డేల సిరీస్లో భాగంగా పాక్తో జరిగిన రెండో వన్డేలో SA బ్యాటర్ క్వింటన్ డికాక్ శతకంతో చెలరేగారు. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డికాక్ 119 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 123* పరుగులు చేశారు. టోనీ(76), ప్రిటోరియస్(46) రాణించారు. కేవలం 40.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయ్యారు. దీంతో 1-1తో సిరీస్ను సమం చేశారు.
News November 7, 2025
పెద్ది నుంచి లిరికల్ కాదు.. వీడియో సాంగ్

టాలీవుడ్ ప్రేక్షకులను డైరెక్టర్ బుచ్చిబాబు ‘చికిరి చికిరి’ అంటూ ఊరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఫుల్ సాంగ్ను ఇవాళ ఉదయం 11.07కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అందరూ అనుకున్నట్లు లిరికల్ సాంగ్ను కాకుండా వీడియో సాంగ్నే రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పెద్ది చిత్రం నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ SMలో పేర్కొంది.
News November 7, 2025
నవంబర్ 7: చరిత్రలో ఈరోజు

*1858: స్వాతంత్ర్య సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ జననం
*1888: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి, భారత రత్న గ్రహీత సి.వి.రామన్(ఫొటోలో) జననం
*1900: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎంపీ ఎన్జీ రంగా జననం
*1954: నటుడు కమల్ హాసన్ జననం
*1971: డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ పుట్టినరోజు
*1981: హీరోయిన్ అనుష్క శెట్టి బర్త్డే
*జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం


