News May 12, 2024

ఢిల్లీ మెట్రో గోడలపై ఖలిస్థానీ నినాదాలు

image

ఎన్నికల వేళ ఢిల్లీ మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థానీ నినాదాలు కనిపించడం కలకలం రేపింది. కరోల్‌భాగ్, ఝండేవాలన్ ప్రాంతాల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. వెంటనే వాటిని చెరిపేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. గతంలోనూ మెట్రో స్టేషన్‌లో ఇలాంటి నినాదాలను దుండగులు రాశారు.

Similar News

News March 28, 2026

నెల్లూరు కేబినెట్ రేసులో కొత్త పేర్లు

image

నెల్లూరు జిల్లాలో త్వరలో జరగబోయే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కొత్త ముఖాలకు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. మంత్రులుగా ఉన్న నారాయణ లేదా ఆనం రామనారాయణ రెడ్డిలలో ఒకరిని మారుస్తారనే ప్రచారం సాగుతోంది. వారి స్థానంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మహిళా కోటా లేదా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన పనితీరు, దూకుడును బట్టి మంత్రి పదవి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

News March 28, 2026

ఆయిల్ పామ్ తోటల్లో పచ్చిరొట్ట ఎరువులతో ప్రయోజనం

image

పచ్చిరొట్ట ఎరువులు పంటలకు మేలు చేస్తాయి. ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు గల ఆయిల్ పామ్ మొక్కల పాదులలో మూడు అడుగుల దూరములో జనుమువేసి, పూతదశ వరకు పెంచిన తర్వాత దానిని చిన్నచిన్న ముక్కలుగా చేసి పాదులలో వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల నీటి వృథా అరికట్టటమే కాకుండా నేలలో సేంద్రియ పదార్థాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. దీని వలన కలుపు మొక్కల బెడద తగ్గుతుంది.

News March 28, 2026

పాండ్య ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చారా?

image

ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందికి హార్దిక్ పాండ్య రివార్డు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందజేసినట్లు ప్రచారం జరిగింది. అదంతా అబద్ధమని ఒక్కొక్కరికి రూ.10వేల చెక్కు ఇచ్చారని నేషనల్ మీడియా క్లారిటీ ఇచ్చింది. కాగా టీ20 ప్రపంచకప్ కోసం పాండ్య వాంఖడే స్టేడియంలో అర్ధరాత్రి వరకు ప్రాక్టీస్ చేశారు. తనకు సహకరించిన గ్రౌండ్ స్టాఫ్‌కు రివార్డు ఇస్తానని అప్పుడే మాట ఇచ్చారు.