News March 18, 2024
ఖమ్మం: రూ.800 కోట్లతో భారీ సాగునీటి పథకం

మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర మండలాల రైతుల సాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సాగర్ రెండో జోన్ నుంచి సాగర్ జలాలు అందించేందుకు అధికారులతో రూపకల్పన చేయించారు. ఇందుకు రూ.800 కోట్లతో భారీ సాగునీటి పథకాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల రెండు మండలాల్లోని 33,025 ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరు అందించనున్నారు.
Similar News
News January 5, 2026
KMM: అవినీతి రహిత సేవలే లక్ష్యం: మంత్రి పొంగులేటి

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 3 దశల్లో 94 కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా మరో 10 సమీకృత భవనాలకు శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ సంస్కరణల వల్ల అవినీతికి అడ్డుకట్ట పడటమే కాకుండా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుందని ఆయన తెలిపారు.
News January 5, 2026
రేపు ఖమ్మం కలెక్టరేట్లో సర్వపక్ష సమావేశం

ఖమ్మం జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో రేపు కలెక్టరేట్ కార్యాలయంలో సర్వపక్ష సమావేశం నిర్వహించనున్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిబంధనలు, ఓటరు జాబితా మరియు ఏర్పాట్లపై కలెక్టర్ చర్చించనున్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా కోరనున్నారు.
News January 5, 2026
200 ఏళ్లు నిలిచేలా.. రూ.200 కోట్లతో మేడారం ముస్తాబు: మంత్రి పొంగులేటి

మేడారం జాతర కోసం రూ. 200 కోట్లతో చేపట్టిన ఆధునీకరణ పనులు 95 శాతం పూర్తయ్యాయని, ఇవి 200 ఏళ్లు నిలిచేలా రాతి కట్టడాలతో నిర్మించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మండలిలో వెల్లడించారు. జాతర పరిసరాల్లో 10 కి.మీ. మేర నాలుగు లైన్ల రోడ్లు వేశామని, భక్తుల సౌకర్యార్థం మరో 63 ఎకరాలు సేకరిస్తామని తెలిపారు. కుంభమేళా తరహాలో జాతర ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.


