News March 18, 2024

ఖమ్మం: రూ.800 కోట్లతో భారీ సాగునీటి పథకం

image

మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర మండలాల రైతుల సాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సాగర్ రెండో జోన్ నుంచి సాగర్ జలాలు అందించేందుకు అధికారులతో రూపకల్పన చేయించారు. ఇందుకు రూ.800 కోట్లతో భారీ సాగునీటి పథకాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల రెండు మండలాల్లోని 33,025 ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరు అందించనున్నారు.

Similar News

News January 27, 2026

ఎదులాపురం మున్సిపల్‌ బరిలో బీజేపీ

image

మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకుడు శాసనాల శ్రీరామ్ వెల్లడించారు. మంగళవారం ఎదులాపురంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారానే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News January 27, 2026

ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు లేవు..!

image

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ గడువు ఏప్రిల్ వరకు ఉన్నందున, ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరగటం లేదు. కేవలం జిల్లాలోని మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖమ్మం కార్పొరేషన్‌కు మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వెలువడిన మున్సిపాలిటీల్లో ఫిబ్రవరి 11న పోలింగ్, 13 ఫలితాలు వెల్లడవుతాయి.

News January 27, 2026

ఖమ్మం: ఏకలవ్య గురుకులాల్లో అడ్మిషన్స్ ఓపెన్

image

ఉమ్మడి జిల్లాలోని ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు RCO అరుణకుమారి తెలిపారు. CBSE సిలబస్‌‌లో బోధన ఉంటుందన్నారు. భద్రాద్రిలోని ములకలపల్లి, గండుగులపల్లి, గుండాల, చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ, టేకులపల్లితో ఖమ్మంలోని సింగరేణి పాఠశాలలో 480 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవాలని, మార్చి 29న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.