News March 18, 2024
ఖమ్మం: ‘పది’ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు

పదోతరగతి వార్షిక పరీక్షలు నేడు మొదలుకానున్నాయి. ఉదయం9.30 నుంచి మధ్యాహ్నం12. 30 గంటల వరకు జరగనున్నాయి. 16,856 మంది హాజరుకానున్నారు. వీరి కోసం96 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 96 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 97 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 1, 983 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. పరీక్షలను ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనునన్నాయి.
Similar News
News January 28, 2026
ఖమ్మం: ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ అమలు: సీపీ

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేటి నుంచి అమల్లోకి వచ్చిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎన్నికల నిర్వహణను ప్రశాంతంగా సాగించేందుకు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘనలకు ఎలాంటి అవకాశం ఇవ్వమని, నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు పెంచామన్నారు.
News January 28, 2026
ఖమ్మంలో కేజీ బీన్స్ రూ.50, చామగడ్డ రూ.36

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ రైతు మార్కెట్లో బుధవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ.16, వంకాయ రూ.30, బెండకాయ రూ.46, పచ్చిమిర్చి రూ.46, కాకర రూ.50, బీరకాయ రూ.46, సొరకాయ రూ.20, దొండకాయ రూ.60, క్యాబేజీ రూ.24, ఆలుగడ్డ రూ.18, చామగడ్డ రూ.36, క్యారెట్ రూ.30, కీరదోస రూ.26, బీన్స్ రూ.50, క్యాప్సికం రూ.56, ఉల్లిగడ్డలు రూ.35, కోడిగుడ్లు(12) రూ.80గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.
News January 28, 2026
ఖమ్మం మార్కెట్కు వరుసగా 4 రోజులు సెలవులు

మేడారం జాతరను పురస్కరించుకుని ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు ఇచ్చినట్లు కార్యదర్శి తెలిపారు. జనవరి 29, 30 తేదీల్లో మేడారం సెలవులు ప్రకటించారు. ఆ తర్వాత జనవరి 31 శనివారం, ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో మార్కెట్కు వరుస సెలవులు వచ్చాయి. తిరిగి ఫిబ్రవరి 2 (సోమవారం) నుంచి మార్కెట్ యథావిధిగా ఉంటుంది.


