News October 14, 2024
భూకేటాయింపులపై ఖర్గే కీలక నిర్ణయం!

ముడా స్కాంలో కర్ణాటక CM సిద్ధ రామయ్యపై ED కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార ట్రస్టుకు KT ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాలను తిరిగివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ భూకేటాయింపుపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇందులో అవకతవకలు జరిగాయంటూ ఓ వ్యక్తి గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 15, 2025
శుభ సమయం (15-11-2025) శనివారం

✒ తిథి: బహుళ ఏకాదశి తె.4.06 వరకు
✒ నక్షత్రం: ఉత్తర రా.1.52 వరకు
✒ శుభ సమయాలు: ఉ.9.00-10.00, సా.5.20-6.10
✒ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు
✒ యమగండం: మ.1.30-3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36 వరకు
✒ వర్జ్యం: ఉ.8.20-9.59 వరకు
✒ అమృత ఘడియలు: రా.7.09-8.49 వరకు
News November 15, 2025
Today Headlines

*జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం
*బిహార్ ఎన్నికల్లో NDAకు 203 సీట్లు, 35 స్థానాలకే పరిమితమైన MGB
*బిహార్ ప్రజలు రికార్డులను బద్దలు కొట్టారు: ప్రధాని మోదీ
*బిహార్ ఫలితాలు ఆశ్చర్య పరిచాయి: రాహుల్ గాంధీ
*KTR అహంకారం, హరీశ్ అసూయ తగ్గించుకోవాలి: CM రేవంత్
*AP: CII సదస్సులో రూ.7.14 లక్షల కోట్ల పెట్టుబడులకు MOUలు
*TG టెట్-2026 నోటిఫికేషన్ విడుదల
News November 15, 2025
ఇవి సర్ప్రైజ్ రిజల్ట్స్: రాహుల్ గాంధీ

బిహార్ అసెంబ్లీ ఫలితాలు ఆశ్చర్యపరిచాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియలో మొదటి నుంచీ అన్యాయం జరిగిందని, అందుకే తాము విజయం సాధించలేకపోయామని చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే పోరాటం చేస్తున్నట్లు వివరించారు. ఓటమిపై కాంగ్రెస్, ఇండియా కూటమి లోతుగా సమీక్షించుకుని, మరింత బలంగా తిరిగివస్తామని పేర్కొన్నారు.


