News November 28, 2024
హైదరాబాద్లో ఖేలో ఇండియా గేమ్స్-2026

2026 ఖేలో ఇండియా గేమ్స్కు HYD ఆతిథ్యం ఇవ్వనుంది. 2025 గేమ్స్ HYDలో నిర్వహించాలని CM రేవంత్ విజ్ఞప్తి చేయగా, బిహార్లో నిర్వహించాలనే ఇప్పటికే నిర్ణయించడంతో 2026లో నిర్వహించేందుకు కేంద్రం అంగీకరించింది. గచ్చిబౌలి, సరూర్నగర్, LB, KVBR స్టేడియాలు, జింఖానా, ఉస్మానియా క్యాంపస్లలో పోటీలు నిర్వహించనున్నారు. 2022లో నేషనల్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, 7వ మిలిటరీ గేమ్స్కు HYD గతంలో వేదికగా నిలిచింది.
Similar News
News January 19, 2026
ఖమేనీపై దాడి జరిగితే పూర్తి స్థాయి యుద్ధమే: ఇరాన్

తమ ప్రజల కష్టాలకు అమెరికా, దాని మిత్రదేశాలే ప్రధాన కారణమని ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఆరోపించారు. అమానవీయ ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. దురాక్రమణకు ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. తమ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి జరిగితే అది ఇరాన్పై పూర్తి స్థాయి యుద్ధంతో సమానమని స్పష్టం చేశారు. ఇరాన్లో కొత్త నాయకత్వం కోసం సమయం వచ్చిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇలా స్పందించారు.
News January 19, 2026
రాష్ట్రంలో 198 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

TGSRTCలో 198 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, డిప్లొమా, BE, BTech అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు 114 ఉన్నాయి. వయసు 18- 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.tgprb.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 19, 2026
పాంటింగ్ను దాటేసిన కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లో నం.3 పొజిషన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ(12,676) నిలిచారు. నిన్న న్యూజిలాండ్తో మ్యాచులో సెంచరీతో ఈ రికార్డును చేరుకున్నారు. 60+ సగటుతో 93కి పైగా స్ట్రైక్ రేట్తో ఆయన కొనసాగుతున్నారు. తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్(12,662), సంగక్కర(9,747), కల్లిస్(7,774), కేన్ విలియమ్సన్(6,504) ఉన్నారు.


