News August 5, 2024
మోక్షజ్ఞ సరసన ఖుషీ కపూర్?

హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా దివంగత శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందట. ఇండియన్ మైథాలజీలో ఉన్న పాత్రల ఆధారంగా సూపర్ హీరో నేపథ్యంలో మూవీ ఉంటుందని టాక్.
Similar News
News April 2, 2026
సేల్స్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 5శాతమే.. అదే కారణమా?

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నా కార్లలో వీటి వాటా ఐదు శాతంలోపే ఉంది. FY26లో మొత్తం 2,29,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు ఏడాదితో (1,23,400 యూనిట్లు) పోలిస్తే వృద్ధి నమోదైనా ఆశించినంత వేగంగా సేల్స్ పెరగట్లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఛార్జింగ్ స్టేషన్ల కొరత, కార్ రేంజ్ – రీసేల్ వ్యాల్యూపై అనుమానాలు ఇందుకు కారణమని పేర్కొంటున్నాయి.
News April 2, 2026
ఏప్రిల్ 2: చరిత్రలో ఈరోజు

* 1942: గణిత శాస్త్రవేత్త వశిష్ఠ నారాయణ సింగ్ జననం
* 1969: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ జననం
* 1872: టెలిగ్రాఫ్ ఆవిష్కర్త సామ్యుల్ మోర్స్ మరణం
* 1933: క్రికెటర్ మహారాజా రంజిత్ సింహ్జీ మరణం (ఫొటోలో)
* 2011: వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో భారత్ విజయం
* అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
* వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే
News April 2, 2026
పాక్ కాళ్ల బేరానికి రావడంతో ఆపేశాం.. లేదంటేనా: నేవీ చీఫ్

ఆపరేషన్ సిందూర్ సమయంలో నేవీ పాత్రపై చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మరికొన్ని నిమిషాల్లో నేవీ పాక్ తీరప్రాంతంపై భారీ దాడులతో విరుచుకుపడనుందనగా ఆ దేశం కాళ్లబేరానికి వచ్చిందన్నారు. వెంటనే దాడులు ఆపాలని వేడుకోవడంతో వ్యూహాలను విరమించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్లో సేవలకుగాను నేవీ అధికారులకు యుద్ధ్ సేవా మెడల్స్ ప్రదానం సందర్భంగా చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.


