News April 14, 2024

ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీ సమస్యలు: సర్వే

image

ఫెయిర్‌నెస్ క్రీములతో భారత్‌లో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని తాజా సర్వేలో తేలింది. అధికంగా పాదరసం వాడటమే దీనికి కారణమని పేర్కొంది. ఈ క్రీములను ఉపయోగించడంతో మెంబ్రేనస్ నెఫ్రోపతి(MN) కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీస్తూ ప్రొటీన్ లీకేజీకి కారణమవుతుందని తెలిపింది. ఆరోగ్యానికి హాని చేసే ఈ తరహా ఉత్పత్తుల వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News March 12, 2026

ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక వార్నింగ్

image

గత 8 ఏళ్లుగా అసత్య ప్రచారం చేస్తూ ఆన్‌లైన్‌‌లో వ్యక్తిగతంగా అటాక్ చేస్తూ వేధిస్తున్నారని రష్మిక వాపోయారు. 24గంటల్లో వేధింపులు మితిమీరిపోయాయని పేర్కొన్నారు. తన ఫ్యామిలీని కూడా లాగారని, ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. 24గంటల్లో ఆ కంటెంట్‌ను తొలగించకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ X వేదికగా వార్నింగ్ ఇచ్చారు. రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ రద్దు వార్తలపైనే ఆమె ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.

News March 12, 2026

చామంతి మొక్కల తలల కత్తిరింపుతో కలిగే లాభం

image

చామంతి సాగులో అధిక దిగుబడి రావాలంటే మొక్కల తలల కత్తిరింపు తప్పక చేపట్టాలి. పొలంలో మొక్కలన్నీ 30 సెంటీమీటర్లు దాకా పెరిగిన తర్వాత వాటి తలలను తుంచేయాలి. దీని వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఫలితంగా పూల దిగుబడి కూడా పెరుగుతుంది. మొక్కల తలలను తుంచాక నిపుణుల సూచనలతో నత్రజని, పొటాష్ ఎరువులను తగిన మోతాదులో అందిస్తే నాణ్యమైన పువ్వులను పొందవచ్చు.

News March 12, 2026

ప్రతీకార సెగలు.. US వ్యూహం వికటించిందా?

image

వెస్ట్ ఏషియాలో యుద్ధం కొత్త మలుపు తిరిగింది. యుద్ధాన్ని ముగించేందుకు ఇప్పుడు ఇరాన్ షరతులు విధిస్తోంది. మరోవైపు దాడులతో ఆశించిన ఫలితం దక్కకపోవడం, చమురు ధరలు ఎగబాకడంతో యుద్ధాన్ని కొనసాగించాలా లేదా విరమించాలా అన్న సందిగ్ధంలో అమెరికా పడింది. యుద్ధాన్ని కొనసాగించాలా లేక శాంతి చర్చలకు మొగ్గు చూపాలా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.