News January 24, 2025
CID చేతికి కిడ్నీ రాకెట్ వ్యవహారం?

HYD సరూర్నగర్ అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసును ప్రభుత్వం CIDకి బదిలీ చేసే అవకాశముంది. ఇప్పటికే వైద్యశాఖ సమావేశంలో అధికారులు దీనిపై చర్చించారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 నెలలుగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నట్లు తేల్చారు. ఒక్కో ఆపరేషన్కు ₹50లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ ఉన్నట్లు సమాచారం.
Similar News
News November 24, 2025
AP TET.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2.59 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇన్ సర్వీస్ టీచర్లు 32,000 మంది దరఖాస్తు చేశారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 10 నుంచి ఆన్లైన్లో రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
News November 24, 2025
తిరుమల కొండపై ‘బంగారు బావి’ వైభవం

శ్రీవారి దర్శనం తర్వాత కనిపించేదే ‘బంగారు బావి’. దీనికి బంగారు రేకుల తాపడం ఉంటుంది. అందుకే ఈ పేరొచ్చింది. ఇందులో నుంచి వచ్చే జలాన్ని స్వామి కైంకర్యాలకు ఉపయోగిస్తారు. ఈ బావి అడుగున వైకుంఠంలో ప్రవహించే విరజానది ప్రవహిస్తుందని నమ్ముతారు. పూర్వజన్మలో తొండమాన్ చక్రవర్తిగా ఉన్న రంగదాసు ఈ పవిత్ర బావిని నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ జలం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 24, 2025
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోండిలా

బ్యాంకు ఖాతాల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను RBI ఉద్గం <


