News March 26, 2025
రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి..సౌత్లో ఫస్ట్ టైమ్

TG: నిమ్స్ ఆసుపత్రిలో 33ఏళ్ల యువకుడికి రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి చేశారు. దీంతో దక్షిణాదిలో రోబోటిక్ విధానంలో ఆపరేషన్ చేసిన తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా నిమ్స్ ఘనత సాధించింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కిడ్నీ సేకరించిన డాక్టర్లు ఆ యువకుడికి విజయవంతంగా అమర్చారు. నిమ్స్లో ఇప్పటివరకూ 2వేల కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ పూర్తిచేసినట్లు డాక్టర్లు తెలిపారు.
Similar News
News January 9, 2026
TODAY HEADLINES

✦ పొదుపు సంఘాలకు త్వరలో ఆన్లైన్లో రుణాలు: AP CM CBN
✦ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనుక కార్పొరేట్ కుట్ర: TG CM రేవంత్
✦ అమరావతిలో రెండో దశ భూ సమీకరణ ఎందుకు: YS జగన్
✦ అశ్లీల కంటెంట్ వివాదం.. గ్రోక్ నివేదికపై కేంద్రం అసంతృప్తి!
✦ TG: ఫిబ్రవరి 3న మున్సిపల్ ఎన్నికలు: రాంచందర్ రావు
✦ తెలంగాణలో ‘రాజాసాబ్’ సినిమా ప్రీమియర్లపై గందరగోళం
✦ తిలక్ వర్మకు సర్జరీ.. NZతో తొలి 3 టీ20లకు దూరం
News January 9, 2026
ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీకి షాక్

తెలంగాణలో ‘రాజాసాబ్’ సినిమా విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రీమియర్స్ ఆలస్యం కావడంతో ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో థియేటర్ల యాజమాన్యాలు సాధారణ ధరలకే టికెట్ల బుకింగ్ ప్రారంభించాయి.
News January 9, 2026
TGలో ‘రాజాసాబ్’ బుకింగ్స్ ప్రారంభం

తెలంగాణలో ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈరోజు రాత్రి 11.30 గంటల ప్రీమియర్ షోకు సంబంధించిన టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్లో అందుబాటులోకి వచ్చాయి. అటు ఏపీలో 9pmకే ప్రీమియర్స్ ప్రారంభం కాగా, థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.


