News March 26, 2025

రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి..సౌత్‌లో ఫస్ట్ టైమ్

image

TG: నిమ్స్ ఆసుపత్రిలో 33ఏళ్ల యువకుడికి రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి చేశారు. దీంతో దక్షిణాదిలో రోబోటిక్ విధానంలో ఆపరేషన్ చేసిన తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా నిమ్స్ ఘనత సాధించింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కిడ్నీ సేకరించిన డాక్టర్లు ఆ యువకుడికి విజయవంతంగా అమర్చారు. నిమ్స్‌లో ఇప్పటివరకూ 2వేల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ పూర్తిచేసినట్లు డాక్టర్లు తెలిపారు.

Similar News

News December 10, 2025

మహానగరంలో ‘మహాలక్ష్మి’కి పెరుగుతున్న ఆదరణ

image

మహానగరంలో మహాలక్ష్మి పథకానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ బస్సు ప్రయాణం కల్పించిన అనంతరం బస్సులు రద్దీగా మారాయి. సరిగ్గా 2ఏళ్ల క్రితం ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు నగరంలో 118 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని.. ఈ మేరకు బస్సుల సంఖ్యను కూడా పెంచుతామని ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ తెలిపారు.

News December 10, 2025

హనుమాన్ చాలీసా భావం – 34

image

అంతకాల రఘుపతి పుర జాయీ |
జహాఁ జన్మ హరిభక్త కహాయీ ||
రామనామ మహిమను తెలియజేసే ఈ వాక్యం.. శ్రీరామునిపై భక్తి కలిగిన వారు అంత్యకాలంలో వైకుంఠానికి చేరుకుంటారని చెబుతోంది. ఆ శ్రీరామ నివాసానికి చేరుకున్న భక్తులు ఆ తర్వాత భూమ్మీద ఎక్కడ జన్మించినా వారు హరిభక్తులే అవుతారట. ఈ పుణ్యం కారణంగా గొప్ప కీర్తి, గౌరవం లభిస్తాయని నమ్మకం. అందుకే రామనామ స్మరణం మర్వకూడదు. <<-se>>#HANUMANCHALISA<<>>

News December 10, 2025

ఇదీ భారత్‌ రైతన్న సత్తా

image

ఒకప్పుడు అమెరికా గోధుమలపై ఆధారపడిన భారత్, నేడు ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా నిలిచి అదే దేశానికి సరఫరా చేస్తోంది. తాజాగా US అధ్యక్షుడు ట్రంప్ ఇండియా నుంచి వచ్చే <<18509981>>రైస్‌పై టారిఫ్స్<<>> వేస్తామన్న నేపథ్యంలో ఈ చరిత్ర మరోసారి చర్చకు వచ్చింది. 1960ల నాటి గ్రీన్ రివల్యూషన్‌తో ఆహార లోపం నుంచి ఆహార భద్రత దిశగా భారత్ ప్రయాణించింది. ఇప్పుడు అమెరికా రైస్ దిగుమతుల్లో నాలుగో వంతు మన దేశం నుంచే అందుతున్నాయి.