News October 25, 2024
రాజువయ్యా టాటా..! పనిమనిషికీ ఆస్తిలో వాటా!

రతన్ టాటా తన రూ.10వేల కోట్లకు రాసిన వీలునామా తాజాగా వెలుగుచూసింది. స్వచ్ఛంద సంస్థ ది రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్(RTEF)కి ప్రధాన వాటా దక్కిందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇక తన సోదరుడు జిమ్మీ టాటా, చెల్లెళ్లు షిరీన్, డియానా, వంటమనిషి రజన్ షా, పనిమనిషి సుబ్బయ్య, స్నేహితుడు శంతను నాయుడుకి టాటా ఆస్తిలో వాటాలు దక్కనున్నాయి. తన శునకం టిటో బాధ్యతను రజన్ షాకే రతన్ అప్పగించినట్లు తెలుస్తోంది.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


