News August 19, 2025
మోదీ భజనలో బిజీగా కిషన్ రెడ్డి, బండి సంజయ్: రేవంత్

TG: రైతుల అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని CM రేవంత్ ఫైరయ్యారు. కేంద్రాన్ని ఎండగడుతూ పార్లమెంట్ ఆవరణలో TG కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపిన ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మోదీ భజన చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తేవడం కోసం కలిసి రావాల్సిన BRS ఎంపీలు పత్తా లేరని దుయ్యబట్టారు.
Similar News
News August 19, 2025
జట్టు ఎంపికపై స్పందించిన అగార్కర్

ఆసియా కప్కు భారత జట్టు ఎంపిక కఠినంగా సాగిందని చీఫ్ సెలక్టర్ అగార్కర్ తెలిపారు. ‘అంచనాలు అందుకోవడంతోనే గిల్ను ఎంపిక చేశాం. అభిషేక్తో కలిసి గిల్, శాంసన్లో ఎవరూ ఓపెనింగ్ చేస్తారనేది ఇంకా డిసైడ్ చేయలేదు. శ్రేయస్ తప్పేం లేదు. అభిషేక్ బౌలింగ్ కూడా చేయగలడు. అందుకే జైస్వాల్ను కాదని అతడిని తీసుకున్నాం. కానీ జట్టులో 15 మందికే చోటు ఇవ్వగలం. 2026 T20 WCకి ఈ జట్టే ఫైనల్ కాదు’ అని చెప్పారు.
News August 19, 2025
రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

TG: ఇవాళ ఆసిఫాబాద్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డితో పాటు ఇతర చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
News August 19, 2025
ఆసియా కప్: స్టార్ ప్లేయర్లకు షాక్

ఆసియా కప్ జట్టులో చోటు దక్కుతుందని ఆశించిన పలువురు టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్లకు నిరాశే ఎదురైంది. శ్రేయస్ అయ్యర్, KL రాహుల్కు చోటు దక్కలేదు. రెస్ట్ పేరిట సిరాజ్ను తీసుకోలేదు. ఈ ఏడాది IPLలో మెరిసిన ప్రసిద్, సుందర్, సుదర్శన్, శశాంక్, పరాగ్ వంటి యంగ్ ప్లేయర్లనూ ఎంపిక చేయలేదు. జైస్వాల్, ప్రసిద్, జురెల్, పరాగ్, సుందర్ను స్టాండ్బైగా పెట్టారు. సెలక్టర్లు ఎంపిక చేసిన <<17452199>>జట్టుపై<<>> మీ కామెంట్?