News January 8, 2025

గవర్నర్‌కు కిషన్ రెడ్డి ఫిర్యాదు

image

TG: హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనపై గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో బీజేపీ నాయకులు గాయపడ్డారని, రాజకీయ ప్రత్యర్థులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన అందించేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.

Similar News

News October 20, 2025

మీరు కొన్న టపాసుల హయ్యెస్ట్ ప్రైస్ ఎంత?

image

దీపావళి పిల్లలకు ఒక ఎమోషన్. దాచి పెట్టుకున్న డబ్బులతో పాటు పేరెంట్స్ వద్ద చిన్నపాటి యుద్ధం చేసైనా కావాల్సిన మనీ సాధించి టపాసులు కొనాల్సిందే. పండుగకు ముందు నుంచే రీల్ తుపాకులు, ఉల్లిగడ్డ బాంబులు కాలుస్తూ సంబరపడే బాల్యం దీపావళి రోజు తగ్గేదేలే అంటుంది. క్రాకర్స్ వెలుగుల్లో నవ్వులు చిందించే పిల్లల ముఖాలు చూసి పేరెంట్స్ సైతం మురిసిపోతారు. ఇంతకీ చిన్నప్పుడు మీరు కొన్న క్రాకర్స్ హయ్యెస్ట్ ప్రైస్ ఎంత?

News October 20, 2025

దీపావళి.. లక్ష్మీ పూజకు ముహూర్తం ఇదే

image

ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ దీపావళి. ఇవాళ లక్ష్మీపూజ, పితృదేవతలకు దివిటీ చూపించడం, దీపదానం వంటివి చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. సా.7 నుంచి రా.8.30 మధ్య లక్ష్మీపూజ ఆచరించడానికి మంచి సమయమని పేర్కొంటున్నారు. ప్రదోష కాల సమయం సా.5.45-రా.8.15 మధ్య చేసే పూజలకు విశేషమైన ఫలితాలు ఉంటాయంటున్నారు.

News October 20, 2025

దేశ ప్రజలకు రాష్ట్రపతి, పీఎం దీపావళి విషెస్

image

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సామరస్యం నింపాలని ఆకాంక్షించారు. నిన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.