News February 19, 2025

కుంభమేళాలో కిషన్ రెడ్డి కుటుంబం

image

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పవిత్రస్నానం ఆచరించారు. మంగళవారం సాయంత్రం భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి ఆయన త్రివేణీ సంగమానికి చేరుకున్నారు. సనాతన ధర్మంపై రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణకు కుంభమేళాకు తరలివస్తున్న భక్తజనమే నిదర్శనమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. త్రివేణీ సంగమంలో స్నానం చేయడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు.

Similar News

News January 25, 2026

మీరు చదివిన స్కూల్ ఇప్పుడు ఉందా..?

image

మనం చదివిన స్కూల్, కాలేజ్ ఎప్పటికీ మధుర జ్ఞాపకాలే. కానీ ప్రైవేట్లో చదివిన చాలామంది స్కూళ్లు, కాలేజెస్ ఇప్పుడు లేవు. పేరు, మేనేజ్మెంట్ మారడం, ఆ బిల్డింగ్‌లో మరొకటి కొనసాగడం సహా కొన్ని చోట్లయితే అసలు ఆ నిర్మాణాలే లేవు. ఇంకొందరికైతే స్కూల్ to కాలేజ్ ఏవీ లేవు. ఆ డేస్ గురించి ఫ్రెండ్స్, ఫ్యామిలీ చిట్‌చాట్లో ఈ మధ్య ఎక్కువగా ఇవి విన్పిస్తున్నాయి. ఇంతకీ మీరు చదివినవి ఇప్పుడున్నాయా? కామెంట్ చేయండి.

News January 25, 2026

చిరంజీవి-బాబీ మూవీ.. టైటిల్ ఇదేనా?

image

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ టైటిల్‌పై SMలో టాక్ నడుస్తోంది. ‘కాకా’ అనే పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తారని, కుమార్తెగా కృతి శెట్టి కనిపిస్తారని సమాచారం. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో చిరుకు బాబీ హిట్ ఇవ్వడం తెలిసిందే.

News January 25, 2026

భర్తపైనే ఎదురుకేసు పెట్టి.. ఆస్తి రాయించుకుని..

image

AP: గుంటూరు(D)లో <<18938678>>భర్తను భార్య చంపిన<<>> కేసులో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. గోపీతో తన భార్య మాధురి వివాహేతర బంధం గురించి శివనాగరాజుకు తెలిసి కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో CC కెమెరాలు పెట్టాలని భర్త భావించాడు. దీంతో అతడి హత్యకు మాధురి ప్లాన్ చేసింది. భర్తపై PSలో ఫిర్యాదు చేసి, పుట్టింటి వారు కట్నంగా ఇచ్చిన ఆస్తిని తన పేరుతో రాయించుకుంది. తర్వాత గోపీ, ఓ RMPతో కలిసి హత్య చేసిందని తెలుస్తోంది.