News September 8, 2024

ఖమ్మంలో కిషన్ రెడ్డి పర్యటన.. బాధితులకు పరామర్శ

image

TG: ఖమ్మం నగరంలో మున్నేరు నది వరదతో నష్టపోయిన బాధితులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరదలో కొట్టుకుపోయిన ఇళ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఓదార్చారు. పునరావాస కార్యక్రమాలను పరిశీలించారు. కిషన్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు.

Similar News

News December 2, 2025

చంద్రబాబు కేసులను మూసివేయిస్తున్నారు: MLC బొత్స

image

AP: తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించేందుకు CM <<18441609>>చంద్రబాబు<<>> అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని YCP MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఫిర్యాదుదారులను బెదిరించి కేసులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని విమర్శించారు. “స్కిల్‌, అసైన్డ్‌ ల్యాండ్స్‌, రింగ్‌రోడ్‌, ఫైబర్‌నెట్‌, లిక్కర్‌ సహా పలు కేసులు ఉన్నప్పటికీ.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో పురోగతి లేదు. గవర్నర్‌ చర్యలు తీసుకోవాలి” అని కోరారు.

News December 2, 2025

ఉచితంగా క్రికెట్ మ్యాచులు చూసే అవకాశం

image

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ మ్యాచులను ఫ్రీగా చూసేందుకు అభిమానులను అనుమతిస్తున్నారు. స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, షమీ, హర్షల్ పటేల్‌తో పాటు పలువురు ప్లేయర్లు ఈ సిరీస్‌లో ఆడుతున్నారు. ఉప్పల్‌తో పాటు జింఖానా, ఎల్బీ స్టేడియాల్లో మ్యాచులు జరుగుతున్నాయి. షెడ్యూల్ <>ఇదే.<<>>

News December 2, 2025

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (<>STPI<<>>) 24 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 12వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ స్టాఫ్, టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్, అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE/B.Tech, MSc, M.Tech, PhD, డిప్లొమా, టెన్త్+ITI, ఇంటర్, డిగ్రీ, PG, MBAతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: stpi.in