News February 3, 2025
KKD: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పీజీఆర్ఎస్ రద్దు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కాకినాడ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం రద్దుచేస్తున్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తూర్పు-పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదుల కోరకు సంబంధిత సచివాలయంలో మీకోస పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News November 28, 2025
VKB: వంట రాదని భర్త వేధింపులతో ఆత్మహత్య

‘వంట రాదు, నా కన్నా తక్కువగా చదువుకున్నావు’ అని భర్త వేధించడంతో <<18402838>>ఓ యువతి<<>> ఆత్మహత్య చేసుకున్న ఘటన ధరూర్ మండలంలో జరిగింది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాలు.. ధరూర్ మండలం గంగారం యువతితో(21) పరిగి మండలం మల్లెమోనిగూడకు చెందిన శివలింగంతో 5 నెలల క్రితం వివాహమైంది. వంటరాదు, తక్కువగా చదువుకున్నావని భర్త వేధించడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో మనస్థాపం చెంది పుట్టింటి వద్ద ఆత్మహత్య చేసుకుంది.
News November 28, 2025
వరంగల్: నేతలకు స్వగ్రామాల ఎన్నిక పెద్ద సవాల్

ఇంట గెలిచి రచ్చ గెలువాలంటారు. ఇదీ రాజకీయాల్లో వాస్తవం. ఉమ్మడి వరంగల్లో రాజకీయ నేతలకు తమ గ్రామాలు గెలవడం పెద్ద సవాలుగా మారింది. BRS నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ MLA కడియం శ్రీహరిల స్వగ్రామం పర్వతగిరి. ఇద్దరిది ఒకటే ఊరు కావడంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనేదీ హాట్ టాపిక్. NSPT నేతలైన మాధవరెడ్డి స్వగ్రామం అమీనాబాద్, పెద్ది సుదర్శన్ రెడ్డిది నల్లబెల్లి స్వగ్రామం. ఈ రెండు గ్రామాల్లో హీట్ మొదలైంది.
News November 28, 2025
అన్నల ఆలోచన మారిందా..?

ఇటీవల మల్లోజుల, ఆశన్న వంటి అగ్రనేతలు లొంగిపోతే వారు ఉద్యమ ద్రోహులని మండిపడుతూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. కానీ JAN-1న అందరం లొంగిపోతామని ప్రకటించిన తాజా లేఖలో ఆయుధాలు వీడటమంటే ప్రజలను మోసం చేసినట్లు కాదని పేర్కొంది. ‘సంఘర్షణకు ఇది సరైన సమయం కాదు.. అందుకే ఆయుధ పోరాటం వీడుతున్నాం’ అని వివరించింది. అన్నల్లో ఆలోచన మార్పుకు కారణం.. వాస్తవం అర్థమవడమా? అన్ని దారులు మూసుకుంటున్నాయనే ఆందోళనా?


