News January 10, 2025
KKD: కోడిపందాలపై హైకోర్టు ఆదేశాలు అమలుకు కమిటీలు

సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది .ఈనేపథ్యంలో కాకినాడ ఆర్డీవో మల్లిబాబు గురువారం కార్యాలయంలో డివిజన్ పరిధిలోని ఎస్సై, తాహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. పంచాయితీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, వీఆర్వోలతో బృందాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాలని ఆదేశించారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇస్తున్నట్లు డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు.
Similar News
News November 18, 2025
రాజమండ్రి: నారా లోకేశ్ పర్యటన వాయిదా.. కారణం ఇదే

నవంబర్ 20న రాజమహేంద్రవరం సిటీలో జరగాల్సిన రాష్ట్ర ఐటీ,విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు నగర టీడీపీ కార్యాలయానికి సమాచారం అందింది. ఈ నెల 20వ తేదీన నితీష్కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి లోకేశ్ కూడా హాజరుకానున్నారు. అందువలనే పర్యటన వాయిదా పడినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.
News November 18, 2025
రాజమండ్రి: నారా లోకేశ్ పర్యటన వాయిదా.. కారణం ఇదే

నవంబర్ 20న రాజమహేంద్రవరం సిటీలో జరగాల్సిన రాష్ట్ర ఐటీ,విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు నగర టీడీపీ కార్యాలయానికి సమాచారం అందింది. ఈ నెల 20వ తేదీన నితీష్కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి లోకేశ్ కూడా హాజరుకానున్నారు. అందువలనే పర్యటన వాయిదా పడినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.
News November 18, 2025
రాజమండ్రి: ఒకేసారి రెండు పథకాల డబ్బులు..!

తూర్పు గోదావరి జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా 1,14,991 మంది లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు డీఏఓ ఎస్.మాధవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ కింద రూ. 57.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 5000), పీఎం కిసాన్ కింద రూ. 19.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 2000) మంజూరయ్యాయి. మొత్తం రూ. 77 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.


