News March 19, 2025
KKD: ఢిల్లిలో పవన్ కళ్యాణ్, ఎంపీ తంగెళ్ల

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కలిశారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో ఆయనకు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ను కలిసి ముచ్చటించారు.
Similar News
News November 21, 2025
మంచిర్యాల: ఆసుపత్రిలో ఆరేళ్ల చిన్నారి మృతి

మంచిర్యాలలోని ఓ పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాహితి (6) అనే చిన్నారి మృతి చెందింది. వైద్యం సరిగా అందించకపోవడంతోనే చిన్నారి మృతి చెందిందని కుటుంబీకులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. వైద్య అధికారులు విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చి న్యాయం చేయాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. కాగా గురువారం సైతం ఓ ఆసుపత్రిలో 4నెలల బాబు మృతి చెందిన విషయం తెలిసిందే.
News November 21, 2025
హనుమకొండ: ముగిసిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో పది రోజులపాటు నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విజయవంతంగా ముగిసింది. డీడీజీ( స్టేట్స్), జోనల్ రిక్రూటింగ్ ఆఫీస్ చెన్నై, డైరెక్టర్ రిక్రూటింగ్ ఏఆర్ఓ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో పది రోజులపాటు రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఆర్మీ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులు కాగా జేఎన్ఎస్లో ఫిజికల్ ఫిట్ నెస్ నిర్వహించారు. ఆర్మీ అధికారులు కలెక్టర్ను కలిశారు.
News November 21, 2025
మూవీ ముచ్చట్లు

* ప్రభాస్ చాలా సున్నిత మనస్కుడు.. ఐ లవ్ హిమ్: అనుపమ్ ఖేర్
* DEC 5న జీ5 వేదికగా OTTలోకి ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ
* ‘కొదమసింహం’ రీ రిలీజ్.. వింటేజ్ చిరును చూసి ఫ్యాన్స్ సంబరాలు
* కిచ్చా సుదీప్ మహిళలను కించపరిచారంటూ కన్నడ బిగ్బాస్ సీజన్-12పై మహిళా కమిషన్కు ఫిర్యాదు
* జైలర్-2 తర్వాత తలైవా 173కి కూడా నెల్సన్ దిలీప్ కుమారే డైరెక్టర్ అంటూ కోలీవుడ్లో టాక్


