News February 2, 2025

KKD: బడ్జెట్‌జ్ లేకున్నా నిధులు సాధించే సత్తా కూటమిది

image

మధ్య తరగతి ప్రజానీకానికి ఊరటనిచ్చే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రశంసించారు. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరం నిర్మాణ వ్యయాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. బడ్జెట్‌జ్ లేకున్నా నిధులు సాధించే సత్తా కూటమికి ఉందన్నారు.

Similar News

News November 24, 2025

అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

image

TG: పటాన్‌చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్‌కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్‌కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.

News November 24, 2025

శ్రీశైలంలో లోక కల్యాణార్థం పంచమఠాలలో ప్రత్యేక పూజలు

image

శ్రీశైలంలో లోక కల్యాణార్థం పంచమఠాలలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం విశేష పూజలు, అభిషేకం, పుష్పార్చనలు చేశారు. ముందుగా ఘంటా మఠంలో, ఆ తర్వాత బీమశంఖ రమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలో ఈ పూజా కార్యక్రమాలను జరిపించారు. కొన్ని శతాబ్దాల నుంచి కూడా ఈ మఠాలన్నీ క్షేత్ర ప్రశాంతతలోనూ, ఆలయ నిర్వహణలోనూ, ఆధ్యాత్మికపరంగా, భక్తులకు సదుపాయాలను కల్పించడంలోనూ ప్రధాన భూమికను వహించాయి.

News November 24, 2025

ఆర్జీలను సత్వరమే పరిష్కరించండి: HYD కలెక్టర్

image

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రజావాణిలో అందచేసిన అర్జీలను సత్వరమే అధికారులు స్పందించి పరిష్కరించాలని HYD కలెక్టర్ హ‌రిచంద‌న ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్లు క‌దివ‌న్ ప‌ల‌ని, ముకుంద రెడ్డిలతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన ఆర్జీల‌ను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ కోరారు.