News February 2, 2025

KKD: బడ్జెట్‌జ్ లేకున్నా నిధులు సాధించే సత్తా కూటమిది

image

మధ్య తరగతి ప్రజానీకానికి ఊరటనిచ్చే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రశంసించారు. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరం నిర్మాణ వ్యయాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. బడ్జెట్‌జ్ లేకున్నా నిధులు సాధించే సత్తా కూటమికి ఉందన్నారు.

Similar News

News December 6, 2025

NTR: పొందుగలలో బాలుడికి స్క్రబ్ టైఫస్ జ్వరం

image

మైలవరం మండలం పొందుగలకు చెందిన రాకేశ్ అనే బాలుడు జ్వరంతో బాధపడుతుండగా, కుటుంబ సభ్యులు అతడిని విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్న బాలుడికి పరీక్షలు చేయగా, స్క్రబ్ టైఫస్ జ్వరమని నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని చంద్రాల పీహెచ్‌సీ డాక్టర్ ప్రియాంక తెలిపారు.

News December 6, 2025

జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అత్యల్పంగా రాఘవపేటలో 11.7℃, మన్నెగూడెం, గోవిందారం 11.8, గుల్లకోట 11.9, కథలాపూర్ 12, ఐలాపూర్, నేరెళ్ల 12.1, మేడిపల్లి 12.2, మల్యాల, మద్దుట్ల, రాయికల్ 12.3, సారంగాపూర్, పేగడపల్లి, మల్లాపూర్, పోలాస, కొల్వాయి 12.4, జగ్గసాగర్ 12.5, తిరుమలాపూర్, పూడూర్ 12.6, గొల్లపల్లి, బుద్దేశ్‌పల్లి, అల్లీపూర్ 12.7, గోదూరులో 12.8℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 6, 2025

నిఘాలో తూర్పు గోదావరి

image

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందేలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.