News March 31, 2025

KKD: తుది జట్టు నుంచి రాజును తప్పించిన ముంబై

image

కాకినాడ యువ క్రికెటర్ సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ తన మూడో మ్యాచ్లో తుది జట్టు నుంచి తప్పించింది. తొలి రెండు మ్యాచ్‌లకు అవకాశం ఇచ్చి మూడో మ్యాచ్లో పక్కన పెట్టింది. కేకేఆర్ మ్యాచ్‌లో రాజు స్థానంలో అశ్విని కుమార్‌ను బరిలోకి దింపింది. కాగా సత్యనారాయణ రాజు రెండు మ్యాచ్ల్లో కలిపి కేవలం ఒక వికెట్ తీశారు.

Similar News

News April 2, 2025

నిత్యానంద స్వామి జీవసమాధి? రూ.4 వేల కోట్ల ఆస్తులు ఆమెకేనా?

image

ఆధ్యాత్మిక గురువు <<15958341>>నిత్యానంద<<>>(47) జీవసమాధి అయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఆస్తుల సంరక్షణపై చర్చ జరుగుతోంది. నిత్యానందకు వందల కోట్ల విలువైన కైలాస ద్వీపంతోపాటు తిరువణ్ణామలై, బిడది, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ రూ.4 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇవన్నీ నిత్యానంద శిష్యురాలు, నటి రంజితకే చెందుతాయని ఆయన శిష్యులు చెబుతున్నట్లు సమాచారం.

News April 2, 2025

ఎల్లారెడ్డి: ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసం

image

సైబర్​ నేరాగాళ్ల వలలో పడి మహిళ మోసపోయిన ఘటన ఎల్లారెడ్డి మండలం రుద్రవరంలో చోటుచేసుకుంది. రుద్రవరం గ్రామానికి చెందిన షేర్ల భావన ఈ నెల 26న ఒక డ్రెస్​ ఆర్డర్​ చేసింది. అయితే 30వ తేదీ ఓ అపరిచిత వ్యక్తి ఫోన్​ చేసి మహిళను బెదిరించాడు. తాను మోసపోయానని గ్రహించి ఎల్లారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె 1930కు ఫోన్ చేయగారూ.16 వేలు హోల్డ్‌లో పడ్డాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 2, 2025

హైకోర్టు ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ప్రమాణం చేసిన లావణ్య

image

లక్ష్మణచాంద మండలం చామన్‌పెల్లి గ్రామానికి చెందిన హైకోర్టు అడ్వకేట్ NT లావణ్య తెలంగాణ హైకోర్ట్ అసోసియేషన్ మహిళా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో అత్యధికంగా 1874 ఓట్లు సాధించి సమీప అభ్యర్థిపై 550 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆమెను తోటి న్యాయవాదులు సన్మానించి అభినందనలు తెలిపారు.

error: Content is protected !!