News April 7, 2025
KKD: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న బుకీ అరెస్ట్

ఐపీఎల్ సీజన్ ప్రారంభమవడంతో హనుమకొండ పోలీసులు బెట్టింగ్ రాయుళ్లను ఆదివారం అరెస్ట్ చేశారు. ఏజెంట్లకు మధ్యవర్తిగా వ్యహరిస్తున్న కాకినాడకు చెందిన క్రికెట్ బుకీ వీరమణికూమార్ను అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని యోగేశ్ గుప్తా బెట్టింగ్ లాభాల్లో 9% ఇస్తానని చెప్పడంతో పలువురితో బెట్టింగులు కట్టించాడు. కాకినాడలో ఓ ప్లాటు, రెండు మద్యం దుకాణాలు దక్కించుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Similar News
News April 18, 2025
సూర్యాపేట: పొలం కోయిస్తుండగా కనిపించిన మృతదేహం

వరి పొలంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపిన ఘటన మునగాలలో గురువారం చోటుచేసుకుంది. మునగాలకు చెందిన తూముల వీరస్వామి పొలంలో హార్వెస్టర్తో పొలం కోయిస్తుండగా మృతదేహం కనిపించడంతో భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే వీరస్వామి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
News April 18, 2025
? ప్లేస్లో ఉండాల్సిన నంబర్ ఏంటి?

పై ఫొటోలో ఉన్న రీజనింగ్ క్వశ్చన్ చూశారు కదా! చిన్న లాజిక్ ఉపయోగిస్తే దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ? ప్లేస్లో ఉండాల్సిన నంబర్ ఏంటో కనుగొంటే COMMENT చేయండి.
News April 18, 2025
మెదక్ సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ బదిలీ

మెదక్ సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్. జితేందర్ బదిలీ అయ్యారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జడ్జిల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జితేందర్ మెదక్ నుంచి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్కు 27వ అదనపు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. మెదక్ సీనియర్ సివిల్ జడ్జిగా అర్చన రెడ్డి బదిలీపై రానున్నారు. ఇప్పటికే జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా సూర్యాపేటకు బదిలీ అయిన విషయం తెలిసిందే.