News March 31, 2025
KKR చిత్తు.. బోణీ కొట్టిన ముంబై

వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై బోణీ కొట్టింది. KKRపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 117 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలో ఛేదించింది. రోహిత్(13) నిరాశపర్చగా, రికెల్టన్ 62*, జాక్స్ 16, సూర్య 27* రన్స్ చేశారు. రస్సెల్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటర్లంతా విఫలమవడంతో KKR 16.2 ఓవర్లలోనే ఆలౌటైంది. MI బౌలర్లలో కుమార్ 4, చాహర్ 2, బౌల్ట్, హార్దిక్, పుతుర్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.
Similar News
News April 2, 2025
HCU.. కంచె భూముల అభివృద్ధి ఎందుకంటే?

HCUని అంటిపెట్టుకొని ఉన్న 400 ఎకరాల కంచె భూములతో యూనివర్సిటీకి సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ భూములను అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భారీగా పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అవకాశం ఉందని చెబుతోంది. అయితే ఈ ప్రాంతం వర్సిటీకి చెందినదని, అభివృద్ధి పేరుతో జీవ వైవిధ్యం దెబ్బతీస్తున్నారని విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు వాదిస్తున్నారు.
News April 2, 2025
ప్రకృతి vs అభివృద్ధి.. మీరు ఎటువైపు?

HYD గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించడం వివాదాస్పదం అవుతోంది. వేలాది చెట్లతో నగరానికి ఆక్సిజన్ అందిస్తోన్న ప్రాంతాన్ని అర్బనైజేషన్ చేయడం ఎందుకని ప్రకృతి ప్రేమికులు, HCU స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి నేపథ్యంలో పర్యావరణానికి కొంతమేర నష్టం కలగక తప్పదని.. ఇప్పటి హైటెక్ సిటీ కూడా అలానే వచ్చిందని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News April 2, 2025
కొత్త వైరస్ వల్ల దగ్గితే రక్తం అంటూ వార్తలు.. క్లారిటీ!

కరోనా గుర్తులు చెరిగిపోక ముందే రష్యాలో కొత్త వైరస్ కలవరపెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వైరస్ వల్ల దగ్గితే రక్తం వస్తోందనే వదంతులూ వ్యాప్తి చెందాయి. ఈ వార్తలను ఆ దేశ అధికారులు కొట్టి పారేశారు. ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందలేదని, అది సాధారణ శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ అని స్పష్టం చేశారు. అయితే, కొందరు తాము జ్వరం, దగ్గుతో బాధపడుతున్నామని చెబుతూ టెలిగ్రామ్లో వీడియోలు షేర్ చేసినట్లు సమాచారం.