News March 28, 2025

కేకేఆర్vsలక్నో మ్యాచ్ రీషెడ్యూల్

image

ఏప్రిల్ 6న (ఆదివారం) కేకేఆర్-లక్నో మధ్య జరగాల్సిన మ్యాచును రీషెడ్యూల్ చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. పండుగల కారణంగా తగినంత భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పారని.. దీంతో ఆ మ్యాచును ఏప్రిల్ 8న నిర్వహిస్తామని పేర్కొంది. ఇక ఏప్రిల్ 6న గుజరాత్-SRH మ్యాచ్ ఒకటే ఉంటుందని తెలిపింది.

Similar News

News November 16, 2025

Infosys ఉద్యోగులకు 75% బోనస్‌

image

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ శుభవార్త చెప్పింది. SEP త్రైమాసికానికి సగటున 75% బోనస్ ప్రకటించింది. ఔట్‌స్టాండింగ్‌ పనితీరు కనబర్చిన వారికి 83%, ఉత్తమ పనితీరు ప్రదర్శించిన వారికి 78.5%, అంచనాలు అందుకున్నవారికి 75% లభించనుంది. గతంలో కంటే 7-8% తగ్గినప్పటికీ అన్ని కేటగిరీల్లో సగటున 70.5%-83% అందనుంది. లెవల్‌ 4, 5, 6లోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, టీమ్ లీడర్లు, సీనియర్ మేనేజర్లకు ఈ బోనస్ లభిస్తుంది.

News November 16, 2025

ఇండియా-A ఘన విజయం

image

రాజ్‌కోట్ వేదికగా సౌతాఫ్రికా-Aతో జరిగిన రెండో అనధికార వన్డేలో ఇండియా-A 9 వికెట్ల తేడాతో గెలిచింది. 133 పరుగుల లక్ష్యాన్ని 28 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో రుతురాజ్ (68*) హాఫ్ సెంచరీతో రాణించగా అభిషేక్ 32, తిలక్ 29* రన్స్ చేశారు. ఈ విజయంతో 3 మ్యాచుల సిరీస్‌ను ఇండియా-A 2-0తో సొంతం చేసుకుంది. మూడో అనధికార వన్డే ఈ నెల 19న రాజ్‌కోట్‌లో జరగనుంది.

News November 16, 2025

TG న్యూస్ రౌండప్

image

* ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ HYDలో పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ ఏర్పాటుచేసిన తేనీటి విందుకు CM రేవంత్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ హాజరయ్యారు.
* రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21న HYDలో భారతీయ కళా మహోత్సవానికి హాజరవుతారు. అక్కడి నుంచి పుట్టపర్తికి వెళ్లి సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు.
* రైతులకు యాసంగి బోనస్ రూ.200 కోట్లను వెంటనే విడుదల చేయాలి: హరీశ్ రావు