News August 3, 2024

KL రాహుల్, అతియా శెట్టి గొప్ప మనసు!

image

టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, భార్య అతియా శెట్టి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగ చిన్నారుల కోసం వారు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. లెజెండరీ క్రికెటర్ల వస్తువులను వేలం వేసి, ఆ డబ్బును దివ్యాంగులకు విరాళంగా ఇవ్వనున్నారు. గతంలోనూ రాహుల్ ఇలా తన బ్యాటు, జెర్సీ వంటివి వేలం వేసి వచ్చిన డబ్బును వారికి ఇచ్చారు. దీంతో రాహుల్, అతియా జంటను పలువురు అభినందిస్తున్నారు.

Similar News

News December 4, 2025

సంగారెడ్డి: ‘ర్యాగింగ్‌కు పాల్పడితే జైలుకే’

image

కళాశాలలో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే అక్కడే చర్యలు తీసుకుంటారని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య హెచ్చరించారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్‌పై అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే విద్యార్థులకు జైలు శిక్ష విధిస్తారని చెప్పారు. అధ్యాపకులు, ప్రొఫెసర్లు ప్రత్యేక చొరవ తీసుకొని ఇలాంటి ఘటనకు జరగకుండా చూడాలని పేర్కొన్నారు

News December 4, 2025

తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. వెంకయ్య కీలక వ్యాఖ్యలు

image

AP: తాను చదువుకునే రోజుల్లో అవగాహన లేక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చెప్పారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘AP, TGలు తెలుగును పరిపాలనా భాషగా చేసుకోవాలి. తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం ఇస్తామని చెప్పాలి. అప్పుడే తెలుగు వెలుగుతుంది’ అని పేర్కొన్నారు.

News December 4, 2025

బాత్రూమ్‌లో ఎంతసేపు ఉంటున్నారు?

image

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్‌ను ఆపుకోవడం, బాత్రూమ్‌లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్‌లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.