News February 16, 2025
KMM: అనారోగ్యంతో వైద్య విద్యార్థి మృతి

అనారోగ్యానికి గురై వైద్య విద్యార్థి మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భీక్య తండాకు చెందిన వాంకుడోత్ అఖిల్ (22) ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైన అఖిల్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. డాక్టర్ కావలసిన వాడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 7, 2026
మన పల్లె-మన నీరు పనుల నిర్వహణకు చర్యలు: కలెక్టర్

పుట్టపర్తి కలెక్టరేట్లో మన పల్లె-మన నీరు పనులపై కలెక్టర్ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మన పల్లె-మన నీరు పనులలో భాగంగా జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపొందించేందుకు చెరువులు, సప్లై ఛానల్, చెరువులలో కంపచెట్లు తొలగింపు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. నీటి విలువ సంరక్షణకు పూడిక తీసే పనులు వర్షాకాలం కంటే ముందే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
News March 7, 2026
కడప: ‘10th పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి’

కడప జిల్లాలో 10th పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జేసీ నిధిమీనా పరీక్షల నిర్వాహక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సభా భవన్లో పది పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 169 సెంటర్లలో 28,158 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్జేడీ శామ్యూల్, ఏసీ , డీఈఓ శంషుద్దీన్ హాజరయ్యారు.
News March 7, 2026
మహబూబాబాద్: ప్రతి మనిషి అభివృద్ధిలో మహిళల పాత్రే కీలకం: జిల్లా జడ్జి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కోర్టు సముదాయంలో శనివారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి వ్యక్తి ఎదుగుదలలో, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. గృహ హింస, వరకట్న వేధింపులకు గురవుతున్న బాధితులకు అండగా నిలుస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ న్యాయవాదులను అభినందించారు.


