News April 6, 2024
KMM: ఆర్టీసీకి ఫుల్ ఆదాయం

పెళ్లిళ్లతో పాటు వరుస సెలవులు ఆర్టీసీకి కలిసొస్తున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో సంస్థకు ఆదాయం సమకూరుతోందని అధికారులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు తోడు ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షలు ముగియడంతో వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో నిన్నటి వరకు ఖమ్మం రీజియన్ రూ.1,45,08,008 ఆదాయం సమకూరినట్లు రీజనల్ మేనేజర్ తెలిపారు.
Similar News
News December 10, 2025
ఖమ్మంలో తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధం

ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లోని 172 సర్పంచ్, 1,415 వార్డు స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి 1గంట వరకు పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ విడతలో 2,41,137 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 2,089 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసి, 4,220 మంది సిబ్బందిని విధుల్లో నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
News December 10, 2025
ఖమ్మంలో కాంగ్రెస్కు ఏకగ్రీవాల జోరు

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఖమ్మం జిల్లాలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ ఏకంగా 19 పంచాయతీలను దక్కించుకుంది. ముఖ్యంగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం నారాయణపురం కూడా కాంగ్రెస్ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు ఖాతాలో చేరింది. ఇప్పటివరకు మూడు విడతల్లో కాంగ్రెస్ మొత్తం 56 ఏకగ్రీవాలతో ముందంజలో ఉంది.
News December 10, 2025
పాల్వంచ వ్యక్తికి ఏడాది జైలు

చెక్ బౌన్స్ కేసులో భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన భాసబోయిన వేణుకు ఖమ్మం అదనపు కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రఘునాథపాలెంకు చెందిన వ్యక్తి వద్ద 2022లో వేణు రూ.9.90 లక్షలు అప్పు తీసుకుని, తిరిగి చెల్లించేందుకు ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో కేసు దాఖలైంది. న్యాయాధికారి బిందుప్రియ విచారణ అనంతరం ఈ తీర్పును వెలువరించారు.


