News April 6, 2024

KMM: ఆర్టీసీకి ఫుల్ ఆదాయం

image

పెళ్లిళ్లతో పాటు వరుస సెలవులు ఆర్టీసీకి కలిసొస్తున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో సంస్థకు ఆదాయం సమకూరుతోందని అధికారులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు తోడు ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షలు ముగియడంతో వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో నిన్నటి వరకు ఖమ్మం రీజియన్ రూ.1,45,08,008 ఆదాయం సమకూరినట్లు రీజనల్ మేనేజర్ తెలిపారు.

Similar News

News January 24, 2025

చాపరాలపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

image

ములకలపల్లి మండలం చాపరాలపల్లి గుట్టగూడెం సమీపంలో పేకాట ఆడుతున్న కొంత మంది వ్యక్తులపై పోలీసులు శుక్రవారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులతో పాటు రూ.6000 నగదు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ దాడిలో SI కిన్నెర రాజశేఖర్‌తో పాటు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

News January 24, 2025

బాలికలు ఉన్నత రంగాల్లో రాణించాలి: ఖమ్మం కలెక్టర్

image

బాలికలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ‘బేటీ పడావో బేటీ బచావో’ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బేటీ బచావోకు మద్దతుగా నిర్వహిస్తున్న క్యాంపెయిన్ ఫ్లెక్సీపై సంతకం చేశారు. బాలికలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.

News January 24, 2025

అద్దె ఇంట్లో ఉన్నవారు అనర్హులని అనడం దారుణం: బీజేపీ

image

జూలూరుపాడు: అద్దె ఇంట్లో ఉన్న వారిని ప్రభుత్వం అనర్హులని తేల్చడం దారుణమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిజమైన అర్హులకు ప్రభుత్వ పథకాలు ఇచ్చేవరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.