News December 28, 2024

KMM: ఉత్సాహంగా ప్రారంభమైన సీపీఐ శతాబ్ది ఉత్సవాలు

image

సీపీఐ శత వసంతాల ఉత్సవాలు శుక్రవారం మణుగూరు పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా రామానుజవరంలో అమరుల స్థూపాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. అనంతరం స్థానిక పాత బస్టాండ్ నుంచి ఆదర్శ్ నగర్ వరకు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.దీంతో ఎర్రజెండాలతో మణుగూరు వీధులు ఎరుపెక్కాయి. మహిళలంతా ఎర్రజెండాలను చేతపట్టి నడిచారు. సభా వేదికపై కళాకారులు నృత్య ప్రదర్శన చేసి అలరించారు.

Similar News

News November 24, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కల్లూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} సత్తుపల్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం

News November 24, 2025

ఖమ్మం: రిజర్వేషన్లు ఖరారు.. కలెక్టర్ గెజిట్ విడుదల

image

ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 571 గ్రామ పంచాయతీలకు సర్పంచ్, 5214 వార్డుల రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఖరారు చేశారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో సర్పంచ్ రిజర్వేషన్లలో 260 మహిళలకు.. 311 జనరల్ స్థానాలను కేటాయించారు. అలాగే 5,214 వార్డుల్లో 2,252 మహిళలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల నివేదికను నేడు రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు.

News November 24, 2025

ఖమ్మం నుంచి సూర్యలంక బీచ్‌కు ఆర్టీసీ డీలక్స్‌ బస్సు

image

ఖమ్మం కొత్త బస్టాండ్‌ నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్‌కు డీలక్స్‌ బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ శివప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న (ఆదివారం) ఉ.6.00 గంటలకు ఈ సర్వీసు నడుస్తుందన్నారు. టికెట్‌ ధర పెద్దలకు ₹1,000, పిల్లలకు ₹530గా నిర్ణయించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.