News March 15, 2025

KMM: ఏడాదిలో 16మంది ఏసీబీకి చిక్కారు..!

image

ఉమ్మడి ఖమ్మంలో అవినీతి అధికారులు పెరిగిపోతున్నారు. ఏడాదిలో దాదాపు 16 మంది అధికారులు ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా, ఆఖరికి రూ.1500కు కూడా కక్కుర్తి పడి ఏసీబీకి చిక్కుతున్నారు. ఇంకా గుట్టుచప్పుడు కాకుండా ఎంత నడుస్తోందోనని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం విషయంలో ఇబ్బంది పెడితే తమను సంప్రదించాలని ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్ సూచిస్తున్నారు.

Similar News

News December 4, 2025

ఉన్నత విద్య కోసం ఉచిత శిక్షణ..!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డిగ్రీ పాసైన విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. విదేశీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం, స్కాలర్షిప్ కోసం శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. డిగ్రీ పాసైన వారు www.tgbcstudycircle.gov.in వెబ్ సైట్ ద్వారా ఈనెల 21వ తేదీ లోపు అప్లై చేసుకోవాలని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ విజయలక్ష్మి సూచించారు.

News December 4, 2025

ఉన్నత విద్య కోసం ఉచిత శిక్షణ..!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డిగ్రీ పాసైన విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. విదేశీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం, స్కాలర్షిప్ కోసం శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. డిగ్రీ పాసైన వారు www.tgbcstudycircle.gov.in వెబ్ సైట్ ద్వారా ఈనెల 21వ తేదీ లోపు అప్లై చేసుకోవాలని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ విజయలక్ష్మి సూచించారు.

News December 4, 2025

NRPT: రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ చాటాలి: మంత్రి శ్రీహరి

image

నారాయణపేట జిల్లా మక్తల్ రాష్ట్రస్థాయి ఎస్‌జి‌ఎఫ్ క్రికెట్ పోటీలలో ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి సూచించారు. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగే అండర్-14 బాలుర క్రికెట్ పోటీల కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు బుధవారం బయలుదేరింది. అంతకుముందు క్రీడాకారులు మక్తల్‌లోని మంత్రి నివాసంలో ఆయనను కలిశారు.