News July 29, 2024
KMM: ఓటరు జాబితా తయారీపై కసరత్తు

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితా తయారికి ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేయనుంది. అందుకోసం ప్రతి జిల్లా నుంచి ఐదుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఓటర్ల జాబితా తయారీ కోసం ఎంపిక చేసి ఓటర్ల జాబితా తయారీపై హైదరాబాద్లో వారికి ఒక రోజు శిక్షణ ఇవ్వనుంది.
Similar News
News November 16, 2025
ఖమ్మం: లోక్ అదాలత్లో 4,635 కేసులు పరిష్కారం

కేసుల రాజీతో కక్షిదారుల సమయం, డబ్బు ఆదా అవుతుందని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. రాజగోపాల్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహించారు. మొత్తం 4,635 కేసులను పరిష్కరించారు. వీటిలో క్రిమినల్ కేసులు 596, ఈ పెట్టి కేసులు 2, 350, చెక్ బౌన్స్ 53, ఇతర కేసులు 1,636 ఉన్నాయి. పరిష్కారం చేసుకున్న కక్షిదారులకు పూల మొక్కలు, అవార్డులు బహూకరించారు.
News November 16, 2025
నేటి నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరగతులు

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఖమ్మం అధ్యయన కేంద్రంలో నేటి నుంచి వివిధ కోర్సుల తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మొహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. నేటి నుంచి మార్చి 1 వరకు పీజీ ద్వితీయ సంవత్సర తరగతులు జరుగుతాయని, యూజీ సెమిస్టర్ 1, 3, 5 తరగతులు కూడా ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.
News November 16, 2025
ఖమ్మం జిల్లాలో 3.5 కోట్ల చేప పిల్లల విడుదల: కలెక్టర్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 224 మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో 3.5 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చెరువుల్లో ఫీడ్ సక్రమంగా అందేలా, నీరు కలుషితంగాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 17 లక్షల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రమాదాల్లో మృతి చెందిన కనకయ్య, మంగయ్య కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు.


