News September 12, 2025
KMM: టీజీఎస్ఆర్టీసీ ‘యాత్రాదానం’ కార్యక్రమం ప్రారంభం

టీజీఎస్ఆర్టీసీ తమ సామాజిక బాధ్యతలో భాగంగా “యాత్రాదానం” సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరాం తెలిపారు. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభ సందర్భాలలో ప్రజలు, సంస్థలు ఇచ్చే విరాళాలతో అనాథలు, నిరాశ్రయులు, నిరుపేద విద్యార్థులను పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు విహారయాత్రలకు పంపుతామని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు హెల్ప్లైన్ నెంబర్ 040-69440000ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 4, 2026
ఖమ్మం: అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్

ఖమ్మం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు ఎన్పీడీసీఎల్ ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇస్తోంది. ఇప్పటికే కారేపల్లి, నేలకొండపల్లి, పాలేరు పరిధిలోని 4 కేంద్రాలకు కనెక్షన్లు ఇచ్చినట్లు ఎస్.ఈ శ్రీనివాసచారీ తెలిపారు. చిన్నారుల సౌకర్యార్థం ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ లేని మిగిలిన కేంద్రాలను గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన వైరింగ్ పనులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
News March 4, 2026
మరణంలోనూ వెలుగులు నింపిన శ్రీవల్లి

ఖమ్మం ఎదులాపురం మున్సిపాలిటీకి చెందిన సోమంచి శ్రీవల్లి పుట్టుకతోనే మెదడు సంబంధిత సమస్యతో మంచానికే పరిమితమై, మంగళవారం మృతి చెందింది. పుట్టెడు దుఃఖంలోనూ ఆమె తల్లిదండ్రులు చైతన్యవంతంగా ఆలోచించి, కుమార్తె నేత్రాలను ‘అన్నం ఫౌండేషన్’కు దానం చేశారు. శ్రీవల్లి కళ్లతో మరొకరికి చూపునివ్వాలన్న వారి నిర్ణయాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి సురేష్ అభినందించారు. ఈ దాతృత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
News March 3, 2026
రెండు గంజాయి కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష

ఖమ్మం: రెండు వేర్వేరు గంజాయి కేసుల్లో నిందితుడికి ఒక్కొక్క కేసులో ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె.ఉమాదేవి తీర్పు చెప్పారు. పెనుబల్లి మండలానికి చెందిన వ్యాపారి బోయిన వెంకటరమణ (62) పై 2024, 2025లో వియం బంజర పోలీసుల తనిఖీలలో గంజాయితో పట్టుబడ్డాడు. నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావటంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.


