News August 20, 2024
KMM: త్వరలో ‘ధరణి’ సమస్యలకు చరమగీతం: మంత్రి పొంగులేటి

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, బాధలకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేశానికే ఆదర్శంగా ఉండేలా నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ‘రెవెన్యూ’ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని వివరించారు. చట్టాలు సరిగా లేకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వంలోనే తెలిసిందని పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
☆ తుది విడత పంచాయతీ ఎన్నికల UPDATE కోసం Way2Newsను చూస్తూ ఉండండి.
News December 17, 2025
బుగ్గపాడు ఇండస్ట్రియల్ పార్క్ పనులపై మంత్రి సమీక్ష

సత్తుపల్లిలోని బుగ్గపాడు ఇండస్ట్రియల్ పార్క్లో మౌలిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. పెరుగుతున్న పెట్టుబడిదారుల ఆసక్తి నేపథ్యంలో 200 ఎకరాల మెగా ఫుడ్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ జోన్లలో యూనిట్ నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలన్నారు.
News December 17, 2025
ఖమ్మం విద్యార్థికి 18 ఉద్యోగాలు.. మెచ్చిన గూగుల్

గూగుల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కాంపిటీషన్లో ఖమ్మం విద్యార్థి వేమిరెడ్డి కార్తీక్ రెడ్డి రెండో స్థానంలో నిలిచి రూ.6.50 లక్షల బహుమతిని అందుకున్నారు. ఖమ్మంలో ఇంటర్ నుంచి బీటెక్ వరకు పూర్తి చేసిన కార్తీక్ రెడ్డి తర్వాత ఉద్యోగంలో చేరారు. తర్వాత ఈ అంతర్జాతీయ పోటీలో విజేతగా నిలిచారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనూ 18 ఉద్యోగాలకు ఎంపికయ్యారు.


