News July 13, 2024

KMM: నిధులు లేక పడకేసిన పంచాయితీ పాలన

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీలు నిధుల లేమితో తలడిల్లుతున్నాయి. ఏడాదిగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, ఆరు నెలలుగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదు. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసిన వెంటనే ఫిబ్రవరి నుండి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ ఉంది. నిధుల కొరతతో పల్లెల బాగోగులు ప్రత్యేక అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

Similar News

News December 19, 2025

అప్రమత్తతో సైబర్ నేరాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి: కలెక్టర్

image

ఖమ్మం: సాంకేతికత అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. సైబర్ క్రైమ్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ నందు అధికారులు, సిబ్బందికి సైబర్ క్రైమ్ నియంత్రణపై కలెక్టర్ ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరికీ సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల కొంత మంది వాటిని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.

News December 19, 2025

ఖమ్మం జిల్లాలో 172మంది లష్కర్ల నియామకం

image

ఖమ్మం జిల్లా జలవనరుల శాఖలో సాగునీటి పంపిణీ పర్యవేక్షణ కోసం ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 172మంది లష్కర్లను నియమించారు. మూడు ఏజెన్సీల ద్వారా చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారికి నెలకు రూ. 15వేల వేతనం చెల్లించనున్నారు. ఈ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, ఎమ్మెల్యేల సిఫారసులకు పెద్దపీట వేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియామకాల్లో అర్హులకు అన్యాయం జరిగిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

News December 19, 2025

ఖమ్మం: ప్రశాంతంగా ముగిసిన పల్లె సమరం: కలెక్టర్ అనుదీప్

image

ఖమ్మం జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రకటించారు. మొత్తం 566 సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలతో పాటు, 5,168 వార్డులకు ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. విధుల్లో చిత్తశుద్ధితో పనిచేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రజలకు, రాజకీయ పార్టీలకు కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.