News July 13, 2024
KMM: నిధులు లేక పడకేసిన పంచాయితీ పాలన

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీలు నిధుల లేమితో తలడిల్లుతున్నాయి. ఏడాదిగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, ఆరు నెలలుగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదు. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసిన వెంటనే ఫిబ్రవరి నుండి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ ఉంది. నిధుల కొరతతో పల్లెల బాగోగులు ప్రత్యేక అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
Similar News
News December 18, 2025
ఎలక్షన్ అబ్జర్వర్కు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సన్మానం

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా జనరల్ ఎలక్షన్ అబ్జర్వర్ శ్రీ కాళీచరణ్ను జిల్లా కలెక్టర్ అనుదీప్, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీజ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల నిర్వహణలో ఆయన అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో అబ్జర్వర్ పాత్రను వారు కొనియాడారు.
News December 18, 2025
సిబ్బంది పనితీరు అద్భుతం: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 566 సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలతో పాటు 5,168 వార్డులకు ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. విధుల్లో చిత్తశుద్ధితో పనిచేసి, ఎన్నికలను విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
News December 18, 2025
ఖమ్మం కలెక్టర్కు ‘బిట్స్ పిలానీ’ ప్రతిష్ఠాత్మక పురస్కారం

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ విద్యాసంస్థ బిట్స్ పిలానీ ప్రకటించిన ‘యంగ్ అల్యూమ్నీ అచీవర్స్ అవార్డ్స్-2026’కు ఆయన ఎంపికయ్యారు. 2007బ్యాచ్కు చెందిన అనుదీప్, సివిల్ సర్వీసెస్ పరీక్షలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడంతో పాటు, IASగా అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. దీంతో కలెక్టర్కు జిల్లా ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.


