News May 24, 2024
KMM: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు జిల్లాలో 42కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు 14,984 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 10,352మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,632 ఉన్నారు. ఫస్ట్ ఇయర్ ఉదయం 9నుంచి మధ్యహ్నం 12గంటల వరకు సెకండ్ ఇయర్ మధ్యహ్నం 2:30 నుంచి 5:30వరకు నిర్వహిస్తారు. జూన్1న పరీక్షలు ముగియనున్నాయి.
Similar News
News December 8, 2025
ఖమ్మం: ఉద్యోగులకు కోడ్ ఆఫ్ కండక్ట్.. కరచాలనం చేసినా తప్పే!

ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అభ్యర్థులతో కరచాలనం చేసినా, అనవసర సాన్నిహిత్యం ప్రదర్శించినా అది ఎన్నికల నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘన అవుతుందని సంఘం హెచ్చరించింది. అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారనే భావన ప్రజల్లో కలిగితే, అది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. నిబంధనలు అతిక్రమిస్తే, సర్వీసు నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
News December 8, 2025
ఖమ్మం: తొలి విడత పోరుకు 1,562 బ్యాలెట్ బాక్సులు

ఖమ్మం జిల్లాలో తొలి విడత జీపీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి దశలో 7 మండలాల్లోని 192 సర్పంచ్ స్థానాలు,1,740 వార్డులకు ఎన్నిక జరగనుంది. ఇప్పటికే 20 మంది సర్పంచ్లు,158 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 1,582 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 1,582 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. ఈనెల 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిపి, 2 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు.
News December 8, 2025
ఖమ్మం: రెబల్స్కు షాక్..?

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన రెబల్స్కు పార్టీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మూడు విడతలుగా జరిగిన నామినేషన్ ప్రక్రియలో పలువురు కాంగ్రెస్ నాయకులు రెబల్స్గా బరిలో దిగారు. దీంతో రెబల్స్గా పోటీ చేసే వారిని సస్పెండ్ చేసేందుకు జిల్లా, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.


