News May 24, 2024
KMM: ప్రయాణికులపై ట్రాన్స్జెండర్ల దాడి

ఒడిశా వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్లో ఇద్దరు ట్రాన్స్జెండర్లు రెచ్చిపోయారు. జనరల్ బోగిలో ఎక్కిన వారు ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో బలరాం వారు అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో అతడితో పాటు మరికొందరిపై దాడి చేశారు. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరగగా, సదరు యువకులు ఖమ్మం రైల్వేస్టేషన్లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 16, 2025
పథకాలను లఘుచిత్రాల ద్వారా ప్రచారం చేయాలి: భట్టి

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పథకాలను లఘుచిత్రాల ద్వారా ప్రచారం చేయాలని… వాటికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. డిజిటల్ భూసర్వేకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని అన్నారు.
News February 16, 2025
పెద్దగట్టు జాతర.. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

HYD నుంచి VJW, KMM వెళ్లే వాహనదారులకు SRPT పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించింది. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన SRPT పెద్దగట్టు నేపథ్యంలో ఆయా రూట్లో వాహనాలను మళ్లీస్తున్నారు. జాతర నేటి నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనుంది. జాతరకు తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల ప్రజలు హాజరవుతారు. ఈ నేపథ్యంలో రద్దీ తగ్గే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు.
News February 16, 2025
ఖమ్మం: మృతదేహం లభ్యం.. హత్య? ఆత్మహత్య?

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం- మేడిదపల్లి గ్రామాల మధ్యలో ఉన్న కాల్వకట్ట పక్కన గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాన్ని చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య?.. లేదా హత్య?.. అనే కోణంలో విచారిస్తున్నారు. మృతుడు పాతర్లపాడుకు చెందిన కొల్ల సైదులుగా గుర్తించారు.