News April 6, 2024
KMM: భానుడి భగభగ.. ప్రజలు విలవిల

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. దీంతో ఇండ్లలో నుంచి బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రయాణికులు శీతల పానీయాలు తాగుతూ.. సేద తీరుతున్నారు. వృద్ధులు చిన్నారుల పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఏప్రిల్ నెలలో ఇంత ఉష్ణోగ్రత ఉంటే మే నెలలో ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు.
Similar News
News January 7, 2026
ఖమ్మం: సీఎం సమక్షంలో మరో ముగ్గురు కార్పొరేటర్ల చేరిక

ఖమ్మంలో బీఆర్ఎస్ ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. హైద్రాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి వీరికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో వీరి చేరిక జరిగింది. ఇటీవల కాలంలో ఐదుగురు చేరగా.. ఇప్పుడు ముగ్గురు కార్పొరేటర్లు చేరారు. దీంతో 40 మంది కార్పొరేటర్లతో ఖమ్మం కార్పొరేషన్లో కాంగ్రెస్ బలంగా మారింది.
News January 7, 2026
ఖమ్మం: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఖమ్మం మీదుగా నడిచే పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు సీసీటీఓ రాజగోపాల్ తెలిపారు. నేటి నుంచి ఈనెల 20 వరకు సింహపురి, గౌతమి, పద్మావతి తదితర రైళ్లు సికింద్రాబాద్ వరకు కాకుండా చర్లపల్లి స్టేషన్ వరకే నడుస్తాయని స్పష్టం చేశారు. తిరిగి ఆయా రైళ్లు చర్లపల్లి నుంచే ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.
News January 7, 2026
నేడు ఖమ్మానికి కేటీఆర్.. మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మంలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, నాయకులను సమాయత్తం చేయడం లక్ష్యంగా ఈ పర్యటన జరుగుతోంది. ఉదయం 10:30కు ఖమ్మం చేరుకుని రాపర్తినగర్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు కార్యకర్తలు, నాయకుల ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం సర్పంచ్లకు సన్మానం, కార్యకర్తల సమావేశంలో ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.


